గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక లాంటి పీరియడ్ వార్ డ్రామాలనే క్రిష్ చాలా వేగంగా పూర్తి చేసాడు. మామూలుగా అలాంటి సినిమాలు తీయడానికి రాజమౌళి లాంటి దర్శకులైతే మూడు, నాలుగేళ్లకు పైగా, వేరే దర్శకులయితే కనీసం ఏడాదిన్నర సమయం తీసుకుంటూ వుంటారు. కానీ క్రిష్ వర్కింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్గా వుంటుంది. ఏమి చేయాలనేది ముందే షాట్ టు షాట్ ప్లాన్ చేసేసుకుని, రోజుకి ఎంత భాగం షూట్ చేయాలనేది కూడా ఖచ్చితంగా అనుకుని సెట్స్ మీదకు వెళతాడు. అందుకే ఎంతటి భారీ చిత్రమయినా కానీ క్రిష్ దర్శకత్వంలో ఇట్టే పూర్తయిపోతుంది.
అంతటి భారీ చిత్రాలనే అంత తక్కువ టైమ్లో తీసేసే క్రిష్ ఇక ఒక మామూలు చిన్న సినిమాకు ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తాడు? వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్తో క్రిష్ రూపొందిస్తోన్న చిత్రం కోసం కేవలం ముప్పయ్ అయిదు రోజుల వర్కింగ్ డేస్ పెట్టుకున్నారు. అంత త్వరగా చిత్రీకరించడం, అది కూడా కరోనా కోరలు చాస్తోన్న సమయంలో పూర్తి చేయడం జరిగేది కాదని భావించారు. కానీ క్రిష్ అనుకున్నట్టుగా ముప్పయ్ అయిదు రోజుల్లో షూటింగ్ పనులు పూర్తి చేసేసాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు మాత్రం బ్యాలెన్స్ వున్నాయి. వాటిని కూడా పూర్తి చేసేసి థియేటర్లు మామూలుగా రన్ అయ్యే టైమ్కి రిలీజ్ ప్లాన్ చేసేసుకోవచ్చునట.
This post was last modified on October 24, 2020 2:35 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…