గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక లాంటి పీరియడ్ వార్ డ్రామాలనే క్రిష్ చాలా వేగంగా పూర్తి చేసాడు. మామూలుగా అలాంటి సినిమాలు తీయడానికి రాజమౌళి లాంటి దర్శకులైతే మూడు, నాలుగేళ్లకు పైగా, వేరే దర్శకులయితే కనీసం ఏడాదిన్నర సమయం తీసుకుంటూ వుంటారు. కానీ క్రిష్ వర్కింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్గా వుంటుంది. ఏమి చేయాలనేది ముందే షాట్ టు షాట్ ప్లాన్ చేసేసుకుని, రోజుకి ఎంత భాగం షూట్ చేయాలనేది కూడా ఖచ్చితంగా అనుకుని సెట్స్ మీదకు వెళతాడు. అందుకే ఎంతటి భారీ చిత్రమయినా కానీ క్రిష్ దర్శకత్వంలో ఇట్టే పూర్తయిపోతుంది.
అంతటి భారీ చిత్రాలనే అంత తక్కువ టైమ్లో తీసేసే క్రిష్ ఇక ఒక మామూలు చిన్న సినిమాకు ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తాడు? వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్తో క్రిష్ రూపొందిస్తోన్న చిత్రం కోసం కేవలం ముప్పయ్ అయిదు రోజుల వర్కింగ్ డేస్ పెట్టుకున్నారు. అంత త్వరగా చిత్రీకరించడం, అది కూడా కరోనా కోరలు చాస్తోన్న సమయంలో పూర్తి చేయడం జరిగేది కాదని భావించారు. కానీ క్రిష్ అనుకున్నట్టుగా ముప్పయ్ అయిదు రోజుల్లో షూటింగ్ పనులు పూర్తి చేసేసాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు మాత్రం బ్యాలెన్స్ వున్నాయి. వాటిని కూడా పూర్తి చేసేసి థియేటర్లు మామూలుగా రన్ అయ్యే టైమ్కి రిలీజ్ ప్లాన్ చేసేసుకోవచ్చునట.
This post was last modified on October 24, 2020 2:35 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…