సహజంగా సౌత్ హీరోలకు ఉండాల్సిన అందం పెద్దగా లేకపోయినా అచ్చమైన మాస్ యూత్ లా కనిపించే ప్రదీప్ రంగనాథన్ కు డ్రాగన్ రూపంలో మరో హిట్టు దొరికేసింది. తెలుగులో పర్వాలేదనిపించుకుంటున్నా తమిళంలో మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమాని పూర్తిగా సైడ్ చేసి ఆధిపత్యం చెలాయిస్తోంది. లవ్ టుడేని దాటే సూచనలు ఉన్నాయంటూ కోలీవుడ్ ట్రేడ్ అంచనా వేస్తోంది. నిన్న తమిళనాడు మెయిన్ సెంటర్స్ అన్నింటిలో అధిక శాతం హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఏపీ, తెలంగాణలో చావా తర్వాత వీకెండ్ డామినేషన్ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ దే.
అభిమానులు ఇతన్ని జూనియర్ ధనుష్ గా పిలుచుకుంటున్నారు. ఇప్పటిదాకా తను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాడు. రవి మోహన్ తో తీసిన కోమలి కమర్షియల్ గానూ సక్సెసయ్యింది. ఆ తర్వాత ప్రదీప్ తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లవ్ టుడే ఏకంగా బ్లాక్బ్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ రూపంలో ఇంకో విజయం అందుకున్నాడు. దెబ్బకు నిర్మాణంలో ఉన్న లవ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ కు క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ లవ్ డ్రామాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తానికి విజయ్ సేతుపతి, ధనుష్ దారిలో వెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ క్రమంగా హీరోగా సెటిలైపోయేలా ఉన్నాడు. దర్శకత్వం విడిచిపెట్టనని చెబుతున్నప్పటికీ ఆఫర్లు తనను ఉక్కికిరి బిక్కిరి చేస్తున్నాయి. అధిక శాతం యువత తమలో అతన్ని చూసుకుంటూ కనెక్ట్ అయిపోతున్నారు. ప్రమోషన్ల కోసం తెలుగు నేర్చుకుని వచ్చి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఇతని కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. లవ్ టుడే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని డ్రాగన్ రెండో వారం లోపే దాటేస్తుందని ఒక అంచనా. దగ్గర్లో ఎలాంటి పోటీ లేకపోవడం ప్లస్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా ఈ ఆదివారం టాప్ ప్లేస్ దీనిదే.
This post was last modified on February 23, 2025 11:15 am
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…