నిన్న రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. మొదటిది రిటర్న్ అఫ్ ది డ్రాగన్. లవ్ టుడేతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈసారి కూడా యూత్ ఎంటర్ టైనర్ తోనే వచ్చాడు. ఇంజనీరింగ్ చదువు అబ్బక, ప్రేమించిన అమ్మాయి దూరమై, ఫేక్ సర్టిఫికెట్ తో ఉద్యోగం తెచ్చుకుంటే ఏమవుతుందనే పాయింట్ మీద దర్శకుడు అశ్వత్ మారిముత్తు వేసుకున్న ట్రీట్ మెంట్ టైం పాస్ అయితే చేయించింది కానీ దీనికంటూ బలాలతో పాటు బలహీనతలూ ఉన్నాయి. కాకపోతే ఫక్తు యూత్ నే టార్గెట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళను సంతృప్తి పరచడంలో టీమ్ ఓ మోస్తరుగా సక్సెసయ్యిందని చెప్పాలి.
జాబిలమ్మ నీకు అంత కోపమా విషయానికి వస్తే దర్శకుడు ధనుష్ తీసుకున్న కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా ట్రీట్ మెంట్, ఎంటర్ టైన్మెంట్ రెండూ కుర్రకారుకు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మరీ విసుగు రాకుండా చూసుకున్నాడు. అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ, ఇద్దరి మధ్య బ్రేకప్, తిరిగి కలుసుకునేలా పరిస్థితులు ఏర్పడటం ఇదంతా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుంది. గత ఏడాది వచ్చిన మలయాళం సూపర్ హిట్ ప్రేమలు అంత ఫ్రెష్ గా అనిపించకపోయినా మరీ చికాకు పుట్టించేలా లేకపోవడం జాబిలమ్మని సేవ్ చేసింది. ప్రేమికులు ఎంజాయ్ చేయొచ్చేమో కానీ ఫ్యామిలీస్ కి అంతగా ఎక్కక పోవచ్చు.
ఇక పైచేయి ఎవరిదనే విషయానికి వస్తే ప్రదీప్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుక్ మై షో అమ్మకాల్లో రెండింటి మధ్య యాభై శాతానికి పైగానే వ్యత్యాసం ఉంది. డ్రాగన్ లో ఉన్న మాస్ స్టూడెంట్ అప్పీల్ ఎక్కువగా వసూళ్లను తెస్తుండగా జాబిలమ్మలో ఉన్న సాఫ్ట్ టోన్ వెనుకబడేలా చేస్తోంది. ఇదింకా రెండో రోజే కనక వీకెండ్ అయ్యాక పూర్తి క్లారిటీ వస్తుంది. తెలుగు వర్షన్ల వరకు చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ గా మొదలయ్యాయి కానీ ఏది స్ట్రాంగ్ గా నిలబడుతుందనేది వేచి చూడాలి. యునానిమస్ కాకపోయినా డ్రాగన్ ఆధిపత్యం మన దగ్గరా ఉంది. హిట్టేమో కానీ మనదగ్గర రెండింటికీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on February 22, 2025 11:53 am
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…