Movie News

మహేష్ దగ్గరికెళ్ళిన చావా ?: నిజమేంటంటే…

గత రెండు రోజులుగా ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చావా ముందు మహేష్ బాబు దగ్గరికే వచ్చిందని, కానీ తనకు సూటవ్వదనే అభిప్రాయంతో నో చెప్పడం వల్లే విక్కీ కౌశల్ కు వెళ్లిందని దాని సారాంశం. బాలీవుడ్ మీడియా చెబుతున్న దాని ప్రకారం దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్ దీన్ని పూర్తిగా ఖండించేశారు. అసలు తన మనసులో ఎవరూ లేరని, చావా కథ రాసుకున్నప్పటి నుంచి విక్కీని ఊహించుకుంటూ స్క్రిప్ట్ రాశానని, దానికి అనుగుణంగానే అతను అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడని ప్రశంసించాడు. అసలు వేరే ఆప్షన్ ఆలోచించనే లేదని కుండ బద్దలు కొట్టాడు.

మహేష్ లాంటి స్టార్ తో ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుతారని కొసమెరుపు ఇచ్చాడు. ఇది నిజమే అయ్యుంటుంది. ఎందుకంటే చావా ఏదో కొన్ని నెలల క్రితం అప్పటికప్పుడు అనుకుని తీసిన సినిమా కాదు. మూడేళ్ళ నుంచి పైప్ లైన్ లో ఉంది. నిర్మాణానికి ఏడాదికి పైగానే పట్టింది. అంతకు ముందు స్టోరీ డిస్కషన్స్ కోసం నెలల తరబడి సమయం కేటాయించారు. మహేష్ కి చెప్పాలనే ఆలోచన కానీ, మన సూపర్ స్టార్ కి వినాలనే తీరిక లేని రెండూ లేవు. ఒకవేళ నిజంగా అనుకుని ఉన్నా మహేష్ ఇప్పటికిప్పుడు అలాంటి పాత్ర చేసే మూడ్ లో లేడు. అప్పటికే ఎస్ఎస్ఎంబి 29 ఓకే అయ్యింది.

అయినా పుకార్లకు రెక్కలు ఉండవు కాబట్టి ఎటెటో తిరగడం సహజం. మరో ట్విస్ట్ ఏంటంటే మహేష్ బాబుకి జోడిగా చావా కోసం కత్రినా కైఫ్ ని అనుకున్నారట. ఇది ఇంకా పెద్ద జోక్. విదేశీ వనితల ఛాయలుండే కత్రినాని మరాఠి మహారాణిగా ఊహించుకోవడం కష్టం. అందులోనూ నటన డిమాండ్ చేసే యేసుబాయ్ పాత్రలో. ఇదంతా పక్కనపెడితే చావా విక్కీ కౌశల్ కు తిరుగులేని బ్రేక్ ఇచ్చింది. వస్తున్న స్పందన చూసి తను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. ఇప్పుడీ శంభాజీ మహారాజ్ కథ పుణ్యమాని రచయితలు మరాఠా వీరుల గాథలను తవ్వే పనిలో పడ్డారు.

This post was last modified on February 21, 2025 10:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

4 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

7 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

7 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

8 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

8 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

10 hours ago