Movie News

ED వివాదంలో డైరెక్టర్ శంకర్ : ఏం జరిగిందంటే…

ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ ఏంథిరన్ (రోబో) గురించి అందరూ మర్చిపోయారనుకుంటున్న తరుణంలో దర్శకుడు శంకర్ మెడకు దానికి సంబంధించిన కేసు తాజాగా మెడకు చుట్టుకోవడం తీవ్ర సంచలనం రేపుతోంది. వివరాలేంటో చూద్దాం. ఆరూర్ తమిళనాథన్ అనే రచయిత 2011లో తన కథ జిగూబాని కాపీ కొట్టి రోబో తీశారని ఆరోపిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈడి (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) విచారణ చేపట్టింది. రచన, దర్శకత్వం చేపట్టినందుకు గాను శంకర్ కు 11 కోట్ల 50 లక్షల పారితోషికం అందినట్టు గుర్తించారు.

ఇన్వెస్టిగేషన్ లో బయట పడిన విషయాల ఆధారంగా 10 కోట్ల 11 లక్షలు విలువ కలిగిన శంకర్ మూడు స్థిరాస్తులను ఈడి తాజాగా అటాచ్ చేయడం చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. కాపీ రైట్ యాక్ట్ 1957ని ఉల్లంఘిస్తూ శంకర్ చౌర్యానికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్ టిట్యూట్ అఫ్ ఇండియా (FTII) చేపట్టిన మరో విచారణలో ఏంథిరన్, జిగూబా మధ్య సారూప్యతలు ఉన్నాయని నిర్ధారించింది. దీంతో శంకర్ కు సంబంధించిన 11 కోట్ల విలువైన ఆస్తులకు అటాచ్ మెంట్ వచ్చింది. తదుపరి చర్యలు ఇంకా వెల్లడించలేదు.

అప్పట్లోనే రోబో 290 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ వర్గాల్లో సంచలనం. అయితే శంకర్ ఒక్కడే కాపీలో భాగమయ్యాడా లేక అప్పటిదాకా ఆయన వెన్నంటే ఉండి తనదైన ముద్ర వేసిన దివంగత రచయిత సుజాత ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణం ఇంకా బయటికి రాలేదు. ఏడాది గ్యాప్ లో శంకర్ రెండు ప్యాన్ ఇండియా డిజాస్టర్లు చూశారు. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ రెండూ దారుణంగా పోయాయి. ఆ బాధలో ఉండగానే ఇప్పుడీ దశాబ్దంన్నర పాత కేసు షాక్ ఇవ్వడం ఊహించనిది. ఇంకా శంకర్ నుంచి స్పందన రాలేదు. వేల్పరి అనే మరో హిస్టారికల్ సినిమా తీసే పనిలో ఉన్న ఈ క్రియేటివ్ జీనియస్ వివాదం గురించి ఏమంటారో.

This post was last modified on February 20, 2025 9:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

5 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

7 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

7 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

8 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

8 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

10 hours ago