ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ విడుదల ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేశాక ఇప్పటిదాకా కొత్త డేట్ నిర్ణయం జరగలేదు. ఫౌజీ షూటింగ్ లో డార్లింగ్ బిజీ కావడంతో దీనికి బ్రేక్ ఇవ్వక తప్పలేదు. అయితే సాంకేతిక కారణాలతో పాటు కొందరు ఆర్టిస్టుల డేట్లు దొరకడంలో కలిగిన ఇబ్బంది వల్ల ఈ అడ్జస్ట్ మెంట్ జరిగిందనే టాక్ ఉంది కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ది రాజా సాబ్ కోసం అక్టోబర్ రిలీజ్ ఆప్షన్ ని సీరియస్ గా పరిశీలిస్తోందని తెలిసింది. రెండో తేదీ గాంధీ జయంతి గురువారంతో మొదలయ్యే వీకెండ్ బెస్టని భావిస్తోందట.
ముఖ్యంగా అదే రోజు దసరా పండగ రావడం సెలవుల పరంగా కీలకం కానుంది. కానీ ‘కాంతార చాప్టర్ 1’ ఆల్రెడీ ఆ డేట్ అనౌన్స్ చేసుకుంది కనక క్లాష్ తప్పకపోవచ్చు. అదే నెలలో బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందుతున్న ‘రామ్ చరణ్ 16’ రిలీజ్ చేసే అవకాశాల గురించి మెగా కాంపౌండ్ లో గట్టి టాకే వినిపిస్తోంది. షూటింగ్ వేగం చూస్తుంటే సాధ్యమయ్యేలా ఉందట. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కనక ఎక్కువ కాల్ షీట్లు ఇస్తే ఖచ్చితంగా చేస్తానని బుచ్చిబాబు అంటున్నట్టు సమాచారం. అలా జరిగినా కూడా ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్ ఉండకపోవచ్చు. పది రోజులు లేదా రెండు వారాలు గ్యాప్ వచ్చేలా అక్టోబర్ 16 అనుకుంటున్నారట.
ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలో ఉన్న డెసిషన్లే. ఎలా చూసినా ది రాజా సాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే సెప్టెంబర్ 25 ఇంతకు ముందే ప్రకటించుకున్న ‘అఖండ 2 తాండవం’ని తక్కువంచనా వేయడానికి లేదు. అదే రోజు సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కూడా ఉంది. వీటికి పాజిటివ్ టాక్ వస్తే దసరా తర్వాత కూడా థియేటర్లను హోల్డ్ చేస్తాయి. అప్పుడు ది రాజా సాబ్ కొంత రాజీ పడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే పోటీ రసవత్తరంగా మారుతుంది. కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో బాలకృష్ణ, సాయి ధరమ్ తేజ్, ప్రభాస్, రిషబ్ శెట్టి, రామ్ చరణ్ తేజ్ తలపడతారు. ఇంతకన్నా బాక్సాఫీస్ క్లాష్ ఏముంటుంది.
This post was last modified on February 20, 2025 3:29 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…