ఇప్పటిదాకా కమెడియన్ వేషాలతోనే కాలం వెళ్లదీసిన సినీ నటుడు, వైసీపీ నేత అల్లూరి కృష్ణం రాజు అలియాస్ కృష్ణుడు బుధవారం రాత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ముచ్చటపడి మరీ తీయించుకున్న ఫొటోను ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో నిజంగానే కృష్ణుడి మేకోవర్ అదిరిపోయిందని చెప్పాలి. సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో చాలా లావుగా కనిపించిన కృష్ణుడు… అదే ఫిజిక్ ను చాలా కాలం పాటు మెయింటైన్ చేశారు. ఆ ఫిజిక్ ను ఆయన అలా మెయింటైన్ చేశారు అనే కంటే కూడా… ఆ దృఢకాయాన్ని తగ్గించుకునే విషయంలో ఆయన పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి.
అప్పుడెప్పుడో ఆయననే హీరోగా పెట్టి ఓ సినిమా తీశారు కొందరు. సినిమా పెద్దగా ఆడకున్నా… కృష్ణుడి నటన మాత్రం బాాగా ఆకట్టుకుందనే చెప్పాలి. సినిమాల్లో ఉంటూనే ఎందుకనో ఆయన రాజకీయంగా కూడా అడుగులు వేశారు. చాలా మంది సినిమా వాళ్లలా కాకుండా కృష్ణుడు వైసీపీలో చేరిపోయారు. పార్టీలో చేరిన కొత్తల్లో పార్టీ తరఫున ఉత్సాహంగానే కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కృష్ణుడు ఆ తర్వాత ఎందుకనో గానీ ఇనాక్టివ్ అయిపోయారు. అయితే వైసీపీకి మాత్రం ఆయన దూరంగా జరిగింది లేదు. తాజాగా తాడేపల్లి వచ్చిన కృష్ణుడు.. తన అభిమాన నేతను కలిశారు.
కృష్ణుడి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదనే చెప్పాలి., సినిమాల్లో ఏదో కమెడియన్ పాత్రల్లో కనిపించే కృష్ణుడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు. చించినాడ కేంద్రంగా పాలన సాగించిన క్షత్రియ రాజు అల్లూరి వర్ష వెంకట సూర్యనారాయణ రాజు కుమారుడు కృష్ణుడు. 1970లలో నాటి ఇందిరా గాంధీ సర్కారు ప్రయోగించిన ల్యాండ్ సీలింగ్ యాక్టులో భాగంగా కృష్ణుడి కుటుంబానికి చెందిన 4,500 ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. నాడు ఒకే కుటుంబానికి సంబంధించి ఏపీలో ఇంత పెద్ద మొత్తంలో భూమిని కోల్పోయిన ఫ్యామిలీ కృష్ణుడిదేనట.
This post was last modified on February 20, 2025 11:10 am
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…