పుష్ప 2 ది రూల్ లో ఎక్కువ ప్రాధాన్యం దక్కలేదు కానీ పుష్ప 1 ది రైజ్ లో జాలీ రెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న శాండల్ వుడ్ హీరో డాలీ ధనుంజయ్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన గైనకాలజిస్ట్ ధన్యతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేడుకకు సుకుమార్, మైత్రి రవితో పాటు కన్నడ సినీ ప్రముఖులు ఎందరో పాల్గొన్నారు. మైసూర్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు సుమారు 30 వేలకు పైగానే హాజరు కావడం ధనుంజయ్ ఊహించలేదు. ఫ్యాన్స్ తాకిడి ఈ స్థాయిలో ఉంటుందని ప్లాన్ చేసుకోకపోవడం వల్ల పోలీస్ సెక్యూరిటీ ఎంత ఉన్నా అందరిని లోపలోకి పంపించడం సాధ్యపడలేదు.
దీంతో అభిమానులతో పాటు కొందరు సెలబ్రిటీలు సైతం విపరీతమైన రద్దీ వల్ల బయట నుంచి అటే వెళ్లిపోవాల్సి వచ్చింది. తర్వాత విషయం తెలుసుకున్న ధనుంజయ్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పాడు. నిండు మనసుతో తమను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామని, కొందరికి కలిగిన అసౌకర్యం బాధ కలిగించిందని, త్వరలో మరో రూపంలో కలుసుకుంటానని సారీ చెప్పాడు. ఫిబ్రవరి 16 జరిగిన ఈ ఈవెంట్ తాలూకు ఫోటోలు వైరలయ్యాయి. కొత్త జంట చుడముచ్చటగా ఉందంటూ అభినందనల వర్షం కురిసింది.
ప్రస్తుతం కన్నడ సినిమాల మీదే ఎక్కుడ దృష్టి పెడుతున్న ధనుంజయ్ తెలుగు నుంచి ఎన్ని ఆఫర్లు వస్తున్నా ఒప్పుకోవడం లేదు. డేట్ల సమస్యతో పాటు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప ఎస్ చెప్పడం లేదు. ఆ మధ్య సత్యదేవ్ జీబ్రాలో మంచి ఎలివేషన్ దక్కింది కానీ సినిమా యావరేజ్ దగ్గర ఆగిపోవడం కొంత నిరాశే. గతంలో చిరంజీవి వాల్తేరు వీరయ్యలోనూ బాబీ సింహ చేసిన క్యారెక్టర్ కోసం ముందు డాలీనే అడిగారు. కాల్ షీట్లు లేకపోవడం వల్ల వదులుకున్నాడు. ఇకపై కూడా తన వల్ల సినిమాకు ప్లస్ అవుతుందంటే ఖచ్చితంగా టాలీవుడ్ అవకాశాలు ఒప్పుకుంటానని చెబుతున్న ధనుంజయ్ స్వంత భాషలో చాలా బిజీగా ఉన్నాడు.
This post was last modified on February 19, 2025 3:57 pm
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…