Movie News

దుబాయ్ వెళ్లిన RC 17 – అసలు కథేంటి

బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 తాలూకు అప్డేట్లే ఇంకా మొదలవ్వలేదు అప్పుడే ఆర్సి 17 గురించి సోషల్ మీడియాలో హంగామా జరగడం అభిమానులను అయోమయానికి గురి చేసింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ చేయబోయేది రామ్ చరణ్ తోనే అయినప్పటికీ ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. కథను సిద్ధం చేసుకుని త్వరలో ఫైనల్ వెర్షన్ పూర్తి చేయబోతున్నారు. దీని మీద టీమ్ గత కొన్ని వారాలుగా పని చేస్తూనే ఉంది. అయితే చరణ్, సుకుమార్ ఇద్దరూ ఇటీవలే అబుదాబి వెళ్లడంతో అది స్టోరీ డిస్కషన్స్ గురించేననే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే అంతేనా, హమ్మయ్య అనుకోవచ్చు.

మ్యాటర్ ఏంటంటే దుబాయ్ లో జరిగిన ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ వివాహ వేడుకకు హాజరు కావడం కోసం రామ్ చరణ్, సుకుమార్ వేర్వేరు రోజుల్లో అక్కడికి చేరుకున్నారు తప్పించి ముందస్తు సినిమా కోసం ప్లాన్ చేసి కాదట. ఈ కారణంగానే ఆర్సి 16కి చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొనగిస్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమా మీదే ఉంది. గేమ్ ఛేంజర్ మీద అతి నమ్మకంతో మూడేళ్లు వృధాగా పోవడంతో ఈసారి తప్పులు జరగకుండా ఆలస్యం కాకుండా వేగంగా షూట్ జరిగేందుకు సహకరిస్తున్నాడు. వీలైతే ఈ ఏడాది దసరా లేదా దీపావళి రిలీజ్ అనుకుంటున్నారు కానీ అంత సులభమైతే కాదు.

సో ఫ్యాన్స్ రిలాక్స్ కావొచ్చు. ఇక ఆర్సి 17 విషయానికి వస్తే రంగస్థలంని మించి కంటెంట్ ని ప్రేక్షకులు ఆశిస్తారు కాబట్టి దానికి తగ్గట్టే సుకుమార్ పవర్ ఫుల్ సబ్జెక్టుని సిద్ధం చేశారట. పుష్ప నేపధ్యానికి పూర్తి విభిన్నం అనిపించే బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్టు సమాచారం. కథకు సంబంధించిన లీకులు రాలేదు కానీ అప్పుడెప్పుడో రాజమౌళి చెప్పినట్టు ఇంట్రోతో సహా కొన్ని ఎపిసోడ్స్ పేపర్ మీదే టెర్రిఫిక్ అనిపిస్తున్నాయట. ఆర్ఆర్ఆర్ హీరో, పుష్ప డైరెక్టర్ కాంబో దీని మీద మాములు క్రేజ్ నెలకొనదు. అయితే శిష్యుడి సినిమా రిలీజయ్యే దాకా సుకుమార్ తన ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని టీమ్ కి చెప్పినట్టు వినికిడి.

This post was last modified on February 19, 2025 12:58 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

60 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago