బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 తాలూకు అప్డేట్లే ఇంకా మొదలవ్వలేదు అప్పుడే ఆర్సి 17 గురించి సోషల్ మీడియాలో హంగామా జరగడం అభిమానులను అయోమయానికి గురి చేసింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ చేయబోయేది రామ్ చరణ్ తోనే అయినప్పటికీ ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. కథను సిద్ధం చేసుకుని త్వరలో ఫైనల్ వెర్షన్ పూర్తి చేయబోతున్నారు. దీని మీద టీమ్ గత కొన్ని వారాలుగా పని చేస్తూనే ఉంది. అయితే చరణ్, సుకుమార్ ఇద్దరూ ఇటీవలే అబుదాబి వెళ్లడంతో అది స్టోరీ డిస్కషన్స్ గురించేననే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే అంతేనా, హమ్మయ్య అనుకోవచ్చు.
మ్యాటర్ ఏంటంటే దుబాయ్ లో జరిగిన ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ వివాహ వేడుకకు హాజరు కావడం కోసం రామ్ చరణ్, సుకుమార్ వేర్వేరు రోజుల్లో అక్కడికి చేరుకున్నారు తప్పించి ముందస్తు సినిమా కోసం ప్లాన్ చేసి కాదట. ఈ కారణంగానే ఆర్సి 16కి చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొనగిస్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమా మీదే ఉంది. గేమ్ ఛేంజర్ మీద అతి నమ్మకంతో మూడేళ్లు వృధాగా పోవడంతో ఈసారి తప్పులు జరగకుండా ఆలస్యం కాకుండా వేగంగా షూట్ జరిగేందుకు సహకరిస్తున్నాడు. వీలైతే ఈ ఏడాది దసరా లేదా దీపావళి రిలీజ్ అనుకుంటున్నారు కానీ అంత సులభమైతే కాదు.
సో ఫ్యాన్స్ రిలాక్స్ కావొచ్చు. ఇక ఆర్సి 17 విషయానికి వస్తే రంగస్థలంని మించి కంటెంట్ ని ప్రేక్షకులు ఆశిస్తారు కాబట్టి దానికి తగ్గట్టే సుకుమార్ పవర్ ఫుల్ సబ్జెక్టుని సిద్ధం చేశారట. పుష్ప నేపధ్యానికి పూర్తి విభిన్నం అనిపించే బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్టు సమాచారం. కథకు సంబంధించిన లీకులు రాలేదు కానీ అప్పుడెప్పుడో రాజమౌళి చెప్పినట్టు ఇంట్రోతో సహా కొన్ని ఎపిసోడ్స్ పేపర్ మీదే టెర్రిఫిక్ అనిపిస్తున్నాయట. ఆర్ఆర్ఆర్ హీరో, పుష్ప డైరెక్టర్ కాంబో దీని మీద మాములు క్రేజ్ నెలకొనదు. అయితే శిష్యుడి సినిమా రిలీజయ్యే దాకా సుకుమార్ తన ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని టీమ్ కి చెప్పినట్టు వినికిడి.
This post was last modified on February 19, 2025 12:58 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…