కరోనా బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం కొంచెం లేటుగానే చేశాడు విజయ్ దేవరకొండ. నెల రోజుల పాటు ఏమీ మాట్లాడుకుండా సైలెంటుగా ఉన్న అతను.. ఓ భారీ ప్రణాళికతో రెండు రోజుల కిందట మీడియాను పలకరించాడు. రెండు ట్రస్టుల్లాంటివి ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాల కల్పన, బాధితులకు నిత్యావసరాల అందజేత కార్యక్రమాలు పెట్టుకున్నాడు. ఇందుకోసం కోటి 30 లక్షల ఫండ్ కూడా ఏర్పాటు చేశాడు.
దీనిపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజయ్కు ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి కూడా దీనిపై స్పందించాడు. విజయ్ను పొగిడే క్రమంలో ఆయన కెమిస్ట్రీ పాఠాల్లోకి వెళ్లిపోయాడు. ఇనుము, స్టీల్, కంచు, టైటానియం లాంటి లోహాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిపితే ఎనలేని శక్తి వస్తుందని.. అవి అన్ని రకాల ఉపద్రవాలు, కెమికల్ రియాక్షన్లను తట్టుకుంటాయని.. విజయ్ కరోనా బాధితుల్ని ఆదుకునే క్రమంలో ఇలాంటి మిశ్రమంతోనే వచ్చాడని కొనియాడాడు.
ఈ కామెంట్ మీద ఏమీ బదులివ్వని విజయ్.. తాను సందీప్ను బాగా మిస్సవుతున్నట్లు మాత్రం చెప్పాడు. లాక్ డౌన్ టైంలో రెండు మూడు స్క్రిప్టులు రెడీ చేయమని సందీప్ను కోరిన విజయ్.. షూట్ కోసం రెండేళ్లు ఎదురు చూడలేనని అన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్, సందీప్ కలయికలో రెండో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన సందీప్ దీని రీమేక్తో అక్కడా సెన్సేషనల్ హిట్ కొట్టాడు.
తన మూడో సినిమాను కూడా అక్కడే చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. అతను టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తే అది విజయ్ సినిమాతోనే కావచ్చని అంటున్నారు. ఐతే ఆ సినిమా తెరకెక్కడానికి రెండేళ్లు పట్టేలా ఉండటంతో అంత వరకు ఆగలేనని.. లాక్ డౌన్ టైంలో కథ రెడీ చేసుకుంటే.. సాధ్యమైనంత త్వరగా జట్టు కడదామని సందీప్కు విజయ్ సంకేతాలిస్తున్నట్లుంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…