టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కు శ్రీకాళహస్తిలోని శ్రీ మక్కంటి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందింది. ముక్కంటి ఆలయంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను చేతబట్టుకుని ప్రముఖులను ఆహ్వానిస్తూ సాగుతున్నారు.
ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లతో పాటుగా తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, హందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్…
తదితర కీలక రాజకీయ నేతలను కలిసిన సుధీర్ రెడ్డి… బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానం పలికారు. సుధీర్ రెడ్డి ఆహ్వానం పలికిన వారిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఉన్నారు.
పనిలో పనిగా రాజకీయ నేతలను ఆహ్వానిస్తూ సాగుతున్న సుధీర్ రెడ్డి… సినీ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి సుధీర్ రెడ్డి ముక్కంటీశుడి ఆహ్వానాన్ని అందజేశారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని చిరును ఆయన కోరారు. అనంతరం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూ ఆయన ఆహ్వానాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ప్రభాస్ ను కలిసిన సుధీర్ రెడ్డి… శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరారు.
This post was last modified on February 16, 2025 9:36 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…