Movie News

నేషనల్ అవార్డు పై సాయిపల్లవి ఏమందంటే…

దక్షిణాదిన ప్రస్తుతం ఉన్న ఉత్తమ నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. ఆమె నటించిన చిత్రాలు తక్కువే ఉన్నా.. నటిగా మాత్రం గొప్ప పేరు సంపాదించింది. మలయాళంలో నటించిన తొలి చిత్రం ‘ప్రేమమ్’తోనే ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి మంచి ఫాలోయింగ్ సంపాదించిన సాయిపల్లవి.. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ ఫేవరెట్‌గా మారిపోయింది.

లవ్ స్టోరీ, గార్గి, అమరన్, తండేల్.. ఇలా సాయిపల్లవి నటించిన ప్రతి సినిమాలోనూ తన పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ‘గార్గి’ చిత్రానికి ఆమె జాతీయ అవార్డు సాధిస్తుందనే అంచనాలు కూడా ఏర్పడ్డాయి. కానీ ‘తిరు’ చిత్రానికి నిత్యా మీనన్ ఆ అవార్డును సొంతం చేసుకుని సాయిపల్లవికి నిరాశను మిగిల్చింది.

ఐతే సాయిపల్లవి నటన మీద నమ్మకం ఉన్న వాళ్లు.. ఏదో ఒక రోజు ఆమె జాతీయ పురస్కారం గెలుచుకుంటుందనే నమ్మకంతోనే ఉన్నారు. ఐతే స్వయంగా సాయిపల్లవి సైతం నటిగా జాతీయ అవార్డు సాధించాలని లక్ష్యం పెట్టుకుందట. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నట్లు కనిపించే సాయిపల్లవి.. తనకిలాంటి లక్ష్యం ఉందని చెబితే కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఒక కారణం ఉన్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది సాయిపల్లవి.

‘‘అవును. జాతీయ అవార్డు అందుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. నాకు 21 ఏళ్ల వయసున్నపుడు మా బామ్మ నాకో చీర ఇచ్చింది. పెళ్లి చేసుకున్నపుడు దాన్ని కట్టుకోమంది. అప్పటికి నేనింకా సినిమాల్లోకి రాలేదు. ఆమె చెప్పినపుడే పెళ్లి చేసుకున్నపుడే ఆ చీర కట్టుకోవాలనుకున్నా. కానీ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చా. ‘ప్రేమమ్’ కోసం పని చేశా. కెరీర్ తొలి రోజుల్లోనే నేను ఏదో ఒక రోజు ప్రెస్టీజియస్ అవార్డు అందుకుంటానని అనుకున్నా.

జాతీయ అవార్డు అంటే ఎంతో గొప్ప కాబట్టి, అది అందుకున్న రోజు ఆ చీరను కట్టుకోవాలని నిర్ణయించుకున్నా. అది అందుకున్నా అందుకోకపోయినా.. ఈ చీర ధరించే వరకు నా మీద ఒత్తిడి ఉంటుంది’’ అని సాయిపల్లవి తెలిపింది.

This post was last modified on February 16, 2025 10:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

15 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

24 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

1 hour ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

3 hours ago