టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ లో అడుగు పెట్టడం నిన్న అఫీషియలైన సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ సరసన నటించిన టైటిల్ పెట్టని సినిమా టీజర్ నిన్న రిలీజ్ చేశారు. గాయకుడి ప్రేమలో పడ్డ అమ్మాయిగా శ్రీలీలకు పెద్ద స్కోప్ దొరికినట్టు ఉంది. అయితే ఇలాంటి తెరంగేట్రంకి ఆఫర్లు దక్కించుకోవడంలో విశేషం లేదు కానీ సరైన దర్శకుడి చేతిలో పడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
అనురాగ్ బసు అలాంటి వ్యక్తే. 2003లో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన డెబ్యూ సాయతో అంతగా మెప్పించలేదు లేదు రెండో సినిమా మర్డర్ తో బోల్డ్, క్రైమ్ రెండు మిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టడం అప్పట్లో సంచలనం.
ఇమ్రాన్ హష్మీకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది ఇదే. గ్యాంగ్ స్టర్ కూడా ఇదే స్థాయిలో ఆడింది. లైఫ్ ఇన్ ఏ మెట్రో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హృతిక్ రోషన్ కైట్స్ డిజాస్టరైనా బర్ఫీ పేరు తీసుకొచ్చింది. రన్బీర్ కపూర్ లోని బెస్ట్ యాక్టర్ ని చూపించడమే కాక టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉన్న ఇలియానాకు గొప్ప రోల్ ఇచ్చింది.
జగ్గా జాసూస్ పర్వాలేదనిపించుకుంది. చాలా గ్యాప్ తీసుకున్న అనురాగ్ బసు ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ ఓటిటి మూవీ లూడోతో రీ ఎంట్రీ ఇచ్చారు. మెట్రో ఇన్ డైనో ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్నది ఆషీకీ 3 అనే టాక్ ఉంది కానీ నిర్మాతలు మాత్రం కాదంటున్నారు.
ఇక్కడ శ్రీలీలకు సరైన దర్శకుడు దొరికాడని చెప్పడానికి రీజన్ ఉంది. అనురాగ్ బసు సినిమాల్లో హీరోయిన్ కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. కంగనా రౌనత్, మల్లికా శెరావత్ లు స్టార్ డం చూశారంటే దానికాయనే మూలం. ఏదో మొక్కుబడిగా డాన్సులు, లవ్ ట్రాక్స్ కోసం కథానాయకలను తీసుకోరు.
శ్రీలీలకు సైతం అలాంటి ఛాలెంజింగ్ రోల్ దక్కిందని ముంబై టాక్. కాకపోతే ఒకప్పటి మర్డర్ లాగా రొమాన్స్ ఎక్కువగా చూపిస్తారా లేక బర్ఫీలా ఎమోషనల్ జర్నీ చేయిస్తారా అనేది వేచి చూడాలి. ఈ సంవత్సరం దీపావళికి విడుదల కాబోతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ షూటింగ్ ని వేసవిలోగానే పూర్తి చేస్తారని బాలీవుడ్ రిపోర్ట్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…