రెండు దశాబ్దాల తర్వాత ఒక ఇండస్ట్రీ హిట్టుకి సీక్వెల్ తీస్తే అది బ్లాక్ బస్టర్ కావడం అరుదు. కానీ గదర్ 2 ఆ ఘనత సాధించింది. షెడ్డుకి వెళ్లిపోయాడని భావించిన సీనియర్ హీరో సన్నీడియోల్ ని ఒక్కసారిగా ఫామ్ లోకి తీసుకొచ్చి అవకాశాలను పెంచింది. దెబ్బకు బోర్డర్ 2, జాత్ లాంటివి ఆఘమేఘాల మీద తెరకెక్కుతున్నాయి.
ఆయన మీద కనీసం రెండు నుంచి మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ లు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు రేంజ్ ఏ స్థాయిలో ఉందో. ఈయనిలా హ్యాపీగా ఉండగా దర్శకుడు అనిల్ శర్మ, హీరోయిన్ అమీషా పటేల్ పరస్పరం గొడవ పడుతూ రచ్చ చేస్తున్నారు.
అసలేం జరిగిందో చూద్దాం. గదర్ 2 స్టోరీ నెరేషన్ కు వెళ్ళినప్పుడు అనిల్ శర్మ చెప్పిన కథ ప్రకారం క్లైమాక్స్ లో విలన్ పాత్రను అమీషా పటేల్ చంపుతుంది. కీలక మలుపు కదానే సంతోషంతో ఆమె ఒప్పేసుకుంది. తీరా సెట్స్ లోకి అడుగుపెట్టాక అసలు ఆమె క్యారెక్టరే పాకిస్థాన్ వెళ్లే అవసరం లేకుండా మార్చేశారు.
సన్నీ డియోల్ కాకుండా ఆయన కొడుకుగా నటించిన ఉత్కర్ష్ శర్మ ప్రతినాయకుడిని చంపేలా చిత్రీకరించారు. ఎందుకయ్యా అంటే సదరు ఉత్కర్ష్ స్వయానా డైరెక్టర్ సాబ్ గారి కొడుకు కాబట్టి. ఇదంతా అమీషా పటేల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో కాంట్రావర్సి బయటికి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు.
స్క్రిప్ట్ వినకుండా సంతకం చేయలేదు కదా అంటూ అనిల్ శర్మ రివర్స్ కౌంటర్ వేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి అమీషా పటేల్ ధీటుగా బదులు చెబుతూ ఆయన నెరేషన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇప్పుడు సమాధానం చెప్పమంటూ చిక్కుముడి వేసింది.
అయినా ముందు అనుకున్న కథకు తర్వాత మార్పులు చేర్పులు చేయడం చాలా సినిమాలకు జరిగేదే. గదర్ 2 మినహాయింపు కాదు. కాకపోతే అనిల్ శర్మ ఔను అవసరాన్ని బట్టి ఛేంజ్ చేశానని చెబితే సరిపోయేదానికి అవసరం లేకుండా కవరింగ్ చేసే ప్రయత్నం చేయడంతో వ్యవహారం రచ్చకెక్కింది.
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…