Movie News

దర్శకుడు హీరోయిన్ మధ్య గదర్ 2 గొడవ

రెండు దశాబ్దాల తర్వాత ఒక ఇండస్ట్రీ హిట్టుకి సీక్వెల్ తీస్తే అది బ్లాక్ బస్టర్ కావడం అరుదు. కానీ గదర్ 2 ఆ ఘనత సాధించింది. షెడ్డుకి వెళ్లిపోయాడని భావించిన సీనియర్ హీరో సన్నీడియోల్ ని ఒక్కసారిగా ఫామ్ లోకి తీసుకొచ్చి అవకాశాలను పెంచింది. దెబ్బకు బోర్డర్ 2, జాత్ లాంటివి ఆఘమేఘాల మీద తెరకెక్కుతున్నాయి.

ఆయన మీద కనీసం రెండు నుంచి మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ లు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు రేంజ్ ఏ స్థాయిలో ఉందో. ఈయనిలా హ్యాపీగా ఉండగా దర్శకుడు అనిల్ శర్మ, హీరోయిన్ అమీషా పటేల్ పరస్పరం గొడవ పడుతూ రచ్చ చేస్తున్నారు.

అసలేం జరిగిందో చూద్దాం. గదర్ 2 స్టోరీ నెరేషన్ కు వెళ్ళినప్పుడు అనిల్ శర్మ చెప్పిన కథ ప్రకారం క్లైమాక్స్ లో విలన్ పాత్రను అమీషా పటేల్ చంపుతుంది. కీలక మలుపు కదానే సంతోషంతో ఆమె ఒప్పేసుకుంది. తీరా సెట్స్ లోకి అడుగుపెట్టాక అసలు ఆమె క్యారెక్టరే పాకిస్థాన్ వెళ్లే అవసరం లేకుండా మార్చేశారు.

సన్నీ డియోల్ కాకుండా ఆయన కొడుకుగా నటించిన ఉత్కర్ష్ శర్మ ప్రతినాయకుడిని చంపేలా చిత్రీకరించారు. ఎందుకయ్యా అంటే సదరు ఉత్కర్ష్ స్వయానా డైరెక్టర్ సాబ్ గారి కొడుకు కాబట్టి. ఇదంతా అమీషా పటేల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో కాంట్రావర్సి బయటికి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు.

స్క్రిప్ట్ వినకుండా సంతకం చేయలేదు కదా అంటూ అనిల్ శర్మ రివర్స్ కౌంటర్ వేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి అమీషా పటేల్ ధీటుగా బదులు చెబుతూ ఆయన నెరేషన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇప్పుడు సమాధానం చెప్పమంటూ చిక్కుముడి వేసింది.

అయినా ముందు అనుకున్న కథకు తర్వాత మార్పులు చేర్పులు చేయడం చాలా సినిమాలకు జరిగేదే. గదర్ 2 మినహాయింపు కాదు. కాకపోతే అనిల్ శర్మ ఔను అవసరాన్ని బట్టి ఛేంజ్ చేశానని చెబితే సరిపోయేదానికి అవసరం లేకుండా కవరింగ్ చేసే ప్రయత్నం చేయడంతో వ్యవహారం రచ్చకెక్కింది.

This post was last modified on February 14, 2025 2:41 pm

Share

Recent Posts

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

25 minutes ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

1 hour ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

1 hour ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

2 hours ago

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

4 hours ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

9 hours ago