రెండు దశాబ్దాల తర్వాత ఒక ఇండస్ట్రీ హిట్టుకి సీక్వెల్ తీస్తే అది బ్లాక్ బస్టర్ కావడం అరుదు. కానీ గదర్ 2 ఆ ఘనత సాధించింది. షెడ్డుకి వెళ్లిపోయాడని భావించిన సీనియర్ హీరో సన్నీడియోల్ ని ఒక్కసారిగా ఫామ్ లోకి తీసుకొచ్చి అవకాశాలను పెంచింది. దెబ్బకు బోర్డర్ 2, జాత్ లాంటివి ఆఘమేఘాల మీద తెరకెక్కుతున్నాయి.
ఆయన మీద కనీసం రెండు నుంచి మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ లు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు రేంజ్ ఏ స్థాయిలో ఉందో. ఈయనిలా హ్యాపీగా ఉండగా దర్శకుడు అనిల్ శర్మ, హీరోయిన్ అమీషా పటేల్ పరస్పరం గొడవ పడుతూ రచ్చ చేస్తున్నారు.
అసలేం జరిగిందో చూద్దాం. గదర్ 2 స్టోరీ నెరేషన్ కు వెళ్ళినప్పుడు అనిల్ శర్మ చెప్పిన కథ ప్రకారం క్లైమాక్స్ లో విలన్ పాత్రను అమీషా పటేల్ చంపుతుంది. కీలక మలుపు కదానే సంతోషంతో ఆమె ఒప్పేసుకుంది. తీరా సెట్స్ లోకి అడుగుపెట్టాక అసలు ఆమె క్యారెక్టరే పాకిస్థాన్ వెళ్లే అవసరం లేకుండా మార్చేశారు.
సన్నీ డియోల్ కాకుండా ఆయన కొడుకుగా నటించిన ఉత్కర్ష్ శర్మ ప్రతినాయకుడిని చంపేలా చిత్రీకరించారు. ఎందుకయ్యా అంటే సదరు ఉత్కర్ష్ స్వయానా డైరెక్టర్ సాబ్ గారి కొడుకు కాబట్టి. ఇదంతా అమీషా పటేల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో కాంట్రావర్సి బయటికి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు.
స్క్రిప్ట్ వినకుండా సంతకం చేయలేదు కదా అంటూ అనిల్ శర్మ రివర్స్ కౌంటర్ వేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి అమీషా పటేల్ ధీటుగా బదులు చెబుతూ ఆయన నెరేషన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇప్పుడు సమాధానం చెప్పమంటూ చిక్కుముడి వేసింది.
అయినా ముందు అనుకున్న కథకు తర్వాత మార్పులు చేర్పులు చేయడం చాలా సినిమాలకు జరిగేదే. గదర్ 2 మినహాయింపు కాదు. కాకపోతే అనిల్ శర్మ ఔను అవసరాన్ని బట్టి ఛేంజ్ చేశానని చెబితే సరిపోయేదానికి అవసరం లేకుండా కవరింగ్ చేసే ప్రయత్నం చేయడంతో వ్యవహారం రచ్చకెక్కింది.
This post was last modified on February 14, 2025 2:41 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…