పదిహేడు నిమిషాల ఫుటేజీ మాత్రమే వున్న నర్తనశాల చిత్రాన్ని అలా అసంపూర్ణంగానే విడుదల చేస్తున్నారు. ఏటిటి ద్వారా నచ్చిన వాళ్లే ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నారు. చారిటీకి ఈ డబ్బులిస్తామని చెప్పడం వల్ల అసంపూర్ణ సినిమా విడుదల చేస్తున్నారనే నిందలేమీ పడడం లేదు. కాకపోతే పైరసీ తాకిడి వుంటుంది కనుక ఇది ఎంతవరకు పే చేస్తుందనేది రిలీజ్ అయ్యాక కానీ తెలీదు.
ఇదిలావుంటే ఈ సినిమాను ఇలా అసంపూర్ణంగా విడుదల చేస్తుండడంతో చాలా ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా మొదలైన భారీ చిత్రం ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ చిత్రం ఫుటేజీని కూడా విడుదల చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అప్పట్లో బడ్జెట్ పెరిగిపోవడం, ముస్లిమ్ నేతల నుంచి తిరుగుబాటు రావడంతో ఆ సినిమా కొంత షూటింగ్ చేసి ఆపేసారు. దాంతో చిరంజీవిని అలా చూడాలనే అభిమానుల కోరిక మాత్రం అలా మిగిలిపోయింది.
నర్తనశాల ఇలా వస్తోంది కనుక అబు కూడా వస్తే చూడాలని వుందని అభిమానులు అంటున్నారు. నర్తనశాల అంటే బాలకృష్ణ సొంత ప్రాజెక్ట్ కనుక ఆ ఫుటేజీ భద్రపరచుకున్నారు. మరి అబుకి సంబంధించిన ఫుటేజీ ఎవరైనా జాగ్రత్తగా పెట్టారో లేదో? ఏదేమైనా నర్తనశాల కారణంగా అబు సినిమాని ఫాన్స్ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
‘సప్తసాగరాలు దాటి’ చిత్రంలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది రుక్మిణి వసంత్. ఆ సినిమాలో రుక్మిణిని చూసిన…