పదిహేడు నిమిషాల ఫుటేజీ మాత్రమే వున్న నర్తనశాల చిత్రాన్ని అలా అసంపూర్ణంగానే విడుదల చేస్తున్నారు. ఏటిటి ద్వారా నచ్చిన వాళ్లే ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నారు. చారిటీకి ఈ డబ్బులిస్తామని చెప్పడం వల్ల అసంపూర్ణ సినిమా విడుదల చేస్తున్నారనే నిందలేమీ పడడం లేదు. కాకపోతే పైరసీ తాకిడి వుంటుంది కనుక ఇది ఎంతవరకు పే చేస్తుందనేది రిలీజ్ అయ్యాక కానీ తెలీదు.
ఇదిలావుంటే ఈ సినిమాను ఇలా అసంపూర్ణంగా విడుదల చేస్తుండడంతో చాలా ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా మొదలైన భారీ చిత్రం ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ చిత్రం ఫుటేజీని కూడా విడుదల చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అప్పట్లో బడ్జెట్ పెరిగిపోవడం, ముస్లిమ్ నేతల నుంచి తిరుగుబాటు రావడంతో ఆ సినిమా కొంత షూటింగ్ చేసి ఆపేసారు. దాంతో చిరంజీవిని అలా చూడాలనే అభిమానుల కోరిక మాత్రం అలా మిగిలిపోయింది.
నర్తనశాల ఇలా వస్తోంది కనుక అబు కూడా వస్తే చూడాలని వుందని అభిమానులు అంటున్నారు. నర్తనశాల అంటే బాలకృష్ణ సొంత ప్రాజెక్ట్ కనుక ఆ ఫుటేజీ భద్రపరచుకున్నారు. మరి అబుకి సంబంధించిన ఫుటేజీ ఎవరైనా జాగ్రత్తగా పెట్టారో లేదో? ఏదేమైనా నర్తనశాల కారణంగా అబు సినిమాని ఫాన్స్ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.
This post was last modified on October 21, 2020 11:05 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…