కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ భారీ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా స్క్రిప్ట్ దాదాపు లాక్ చేశారు. అదే సమయంలో శంకర్ నుంచి పిలుపు రావడంతో చరణ్ మనసు మారింది. దీంతో గౌతమ్ ప్రాజెక్టు ఆగిపోయింది.
ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కల్ట్ డైరెక్టర్ ఇప్పుడు ఫామ్ లో లేడనే వాస్తవాన్ని మర్చిపోయి గేమ్ ఛేంజర్ కు చరణ్ ఎస్ చెప్పేశాడు. ఫలితంగా మూడేళ్ళ విలువైన కాలం నేల పాలయ్యింది. యావరేజ్ అయినా ఫ్యాన్స్ కి కొంత సంతృప్తి మిగిలేది కానీ దారుణంగా డిజాస్టర్ కావడం మెగాభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
తాజాగా రిలీజైన కింగ్ డమ్ టీజర్ చూశాక వస్తున్న డౌట్ ఒకటే. ఇది రామ్ చరణ్ కు చెప్పిన కథేనా లేక విజయ్ దేవరకొండ కోసం వేరేది రాసుకున్నాడా అని. ఒకవేళ ఒకటే అయితే మాత్రం ఫ్యాన్స్ ఇంకాస్త బాధ పడటం ఖాయం. ఎందుకంటే విజువల్స్, సెటప్, యాక్షన్ బ్లాక్స్ చూస్తుంటే గౌతమ్ తిన్ననూరి ఓ రేంజ్ లో తీశాడని అర్థమవుతోంది.
విజయ్ దేవరకొండకే అంత బాగా నప్పినప్పుడు చరణ్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేవాడన్నది వాస్తవం. ఒకవేళ వేరే స్టోరీ అయితే సమస్య లేదు కానీ ఇదంతా నిజమో కాదో చెప్పడానికి గౌతమ్, చరణ్ ఇద్దరి అందుబాటు ఇప్పట్లో జరగకపోవచ్చు.
చరణ్ సినిమా చేజారింది కాబట్టే దాని స్థానంలో చిరంజీవి విశ్వంభరని యువి ప్లాన్ చేసుకుందనేది మరో వెర్షన్. ఇదంతా యువి నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ ద్వారా జరిగిందనేది ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి చెప్పేందుకు ఈ ఉదాహరణ చాలు.
అసలు గేమ్ ఛేంజర్ బదులు గౌతమ్ తిన్ననూరితోనే రామ్ చరణ్ ప్రొసీడయ్యుంటే ఇవాళ ఫలితం మరోలా ఉండేది. మహేష్ బాబుని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. 3 ఇడియట్స్ రీమేక్ కోసం శంకర్, పొన్నియిన్ సెల్వన్ కోసం మణిరత్నం అడిగినప్పుడు అవి తనకు నప్పవని నో చెప్పాడని టాక్ ఉంది. ఇదే ప్లానింగ్ అంటే.
This post was last modified on February 13, 2025 5:50 pm
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…
హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో…
పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు.…