నందమూరి బాలకృష్ణ రెండు రోజుల కిందట పెద్ద సర్ప్రైజే ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట తన తండ్రి ఎన్టీ రామారావు నటించిన లెజెండరీ మూవీ ‘నర్తనశాల’ను రీమేక్ చేయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించిన ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అంతలో సౌందర్య చనిపోవడంతో ఈ సినిమాను బాలయ్య ఆపేశాడు. ఈ సినిమాను ఆ తర్వాత పున:ప్రారంభించలేదు.
ఐతే అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ ఎడిట్ చేసి ఒక కొలిక్కి తీస్తే 17 నిమిషాల నిడివి తేలింది. ఇప్పుడు దాన్ని ఒక మినీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తేవాలని బాలయ్య సంకల్పించాడు. శ్రేయాస్ ఏటీటీ ద్వారా దసరా కానుకగా ఈ నెల 24న బాలయ్య ‘నర్తనశాల’ విడుదల కాబోతోంది.
ఈ షార్ట్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు టికెట్ కొనాల్సి ఉంటుందని, తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం ఛారిటీకి ఉపయోగిస్తామని బాలయ్య ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే 17 నిమిషాల నిడివి చూసేందుకు మరీ ఎక్కువ రేటు పెట్టడం సమంజసం కాదని బాలయ్య భావించినట్లున్నాడు. అందుకే ఈ ధరను రూ.50కి పరిమితం చేశాడు. ఈ రేటుతోనే ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇలా ఏటీటీలో సినిమాలు రిలీజ్ చేసే ఒరవడికి శ్రీకారం చుట్టిన రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు రూ.100, 150, 200 చొప్పున వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనేమీ రెండు రెండున్నర గంటల్లో ఫీచర్ పిలిమ్స్ తీయలేదు. అరగంట లోపు నిడివే అలా డబ్బులు వసూలు చేశారు. దాంతో పోలిస్తే బాలయ్య ఉదారంగా వ్యవహరించినట్లే. ఐతే ఇలా ఏటీటీలో రిలీజైన కంటెంట్ ఈజీగా పైరేట్ అయి ఇంటర్నెట్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో బాలయ్య ‘నర్తనశాల’ను ఎంతమంది డబ్బులు పెట్టి చూస్తారన్నది ఆసక్తికరం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…