నందమూరి బాలకృష్ణ రెండు రోజుల కిందట పెద్ద సర్ప్రైజే ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట తన తండ్రి ఎన్టీ రామారావు నటించిన లెజెండరీ మూవీ ‘నర్తనశాల’ను రీమేక్ చేయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించిన ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అంతలో సౌందర్య చనిపోవడంతో ఈ సినిమాను బాలయ్య ఆపేశాడు. ఈ సినిమాను ఆ తర్వాత పున:ప్రారంభించలేదు.
ఐతే అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ ఎడిట్ చేసి ఒక కొలిక్కి తీస్తే 17 నిమిషాల నిడివి తేలింది. ఇప్పుడు దాన్ని ఒక మినీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తేవాలని బాలయ్య సంకల్పించాడు. శ్రేయాస్ ఏటీటీ ద్వారా దసరా కానుకగా ఈ నెల 24న బాలయ్య ‘నర్తనశాల’ విడుదల కాబోతోంది.
ఈ షార్ట్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు టికెట్ కొనాల్సి ఉంటుందని, తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం ఛారిటీకి ఉపయోగిస్తామని బాలయ్య ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే 17 నిమిషాల నిడివి చూసేందుకు మరీ ఎక్కువ రేటు పెట్టడం సమంజసం కాదని బాలయ్య భావించినట్లున్నాడు. అందుకే ఈ ధరను రూ.50కి పరిమితం చేశాడు. ఈ రేటుతోనే ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇలా ఏటీటీలో సినిమాలు రిలీజ్ చేసే ఒరవడికి శ్రీకారం చుట్టిన రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు రూ.100, 150, 200 చొప్పున వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనేమీ రెండు రెండున్నర గంటల్లో ఫీచర్ పిలిమ్స్ తీయలేదు. అరగంట లోపు నిడివే అలా డబ్బులు వసూలు చేశారు. దాంతో పోలిస్తే బాలయ్య ఉదారంగా వ్యవహరించినట్లే. ఐతే ఇలా ఏటీటీలో రిలీజైన కంటెంట్ ఈజీగా పైరేట్ అయి ఇంటర్నెట్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో బాలయ్య ‘నర్తనశాల’ను ఎంతమంది డబ్బులు పెట్టి చూస్తారన్నది ఆసక్తికరం.
This post was last modified on October 21, 2020 5:37 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…