బాహుబలి పాన్ జాతీయ స్థాయిలో సంచలనం రేపాక.. ‘పాన్ ఇండియా’ సినిమాల ఒరవడి బాగా పెరిగింది. ఐతే పాన్ ఇండియా పేరుతో బోలెడన్ని సినిమాలు వస్తున్నాయి కానీ.. వాటిలో నిజంగా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నవి ఎన్ని అంటే వేళ్ల మీదే లెక్కపెట్టాలి. భారీ చిత్రాలను పక్కన పెడితే.. మిడ్ రేంజ్ మూవీస్లో కాంతార, కార్తికేయ-2, హనుమాన్ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్రభావం చూపాయి. విజయం సాధించాయి.
తెలుగు నుంచి పాన్ ఇండియా చిత్రాలుగా ప్రచారంలోకి వచ్చి.. చివరికి తెలుగు రాష్ట్రాల అవతల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సినిమాల జాబితా పెద్దదే. అందులోకి తాజాగా ‘తండేల్’ కూడా వచ్చి చేరింది. దీన్ని కూడా పాన్ ఇండియా చిత్రంగానే మొదలుపెట్టారు. అలాగే ప్రమోట్ చేశారు. రిలీజ్ ముంగిట కూడా ముంబయి, చెన్నై సిటీల్లో ప్రమోషనల్ ఈవెంట్లు కూడా చేశారు. కానీ ప్రభావం మాత్రం ఏమీ కనిపించడం లేదు.
‘తండేల్’ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. వీకెండ్ తర్వాత కూడా బలంగా నిలబడుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల అవతల మాత్రం ‘తండేల్’ ప్రేక్షకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేకపోతోంది. తెలుగు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే కర్ణాటకలో సినిమా పర్వాలేదనిపిస్తోంది. అక్కడ రిలీజైంది కూడా తెలుగు వెర్షనే. తమిళంలో సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్ ఉన్నా, కోలీవుడ్ నటుడు కరుణాకరన్ ఓ కీలక పాత్ర చేసినా, దేవిశ్రీ కూడా అక్కడి వారికి సుపరిచితుడే అయినా.. ‘తండేల్’కు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాలేదు.
హిందీలో అయితే సినిమాను మొక్కుబడిగా రిలీజ్ చేశారు. వసూళ్లు కూడా నామమాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మలయాళంలో అయితే ‘తండేల్’ను రిలీజే చేయలేదు. కేరళలోని తెలుగు వారి కోసం మల్టీప్లెక్సుల్లో కొన్ని షోలు కేటాయించారంతే. మొత్తంగా చూస్తే ‘తండేల్’ పేరుకే పాన్ ఇండియా మూవీ. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అని చెప్పాలి.
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…