ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చావా మీద పెద్దగా బజ్ కనిపించడం లేదు. బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా దీని మీద ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. అందులోనూ శంభాజి మహారాజ్ కథ కావడంతో జనాలు ఎగబడి చూస్తారనుకున్నారు.
కానీ అడ్వాన్స్ బుకింగ్స్ దానికి తగ్గట్టు లేవు. ట్రేడ్ అనలిస్టులు రెండు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని చెబుతున్నారు కానీ నిజానికీ సంఖ్య రెండు మూడింతలు ఎక్కువగా ఉండాలి. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ఆకర్షణ.
మహారాష్ట్రలో చావాకు అమ్మకాలు బాగున్నాయి కానీ బయట బజ్ ఎందుకు తక్కువుందో చూద్దాం. శంభాజీ మహారాజ్ గురించి మరాఠి వాసులకు తప్ప ఇతర రాష్ట్రాల్లో తెలిసిన వాళ్ళు తక్కువ. ఎలా అంటే మన సైరా నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు గురించి ముంబైలో అవగాహన కలిగిన జనాలు పెద్దగా లేనట్టే శంభాజీ కథలు చదువుకున్న వాళ్ళు మన సైడ్ అంతంత మాత్రమే.
ఛత్రపతి శివాజీ గురించి పిల్లల చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది కాబట్టి ఆ మాత్రం అవగాహన ఉంది కానీ ఇతర మరాఠా వీరుల గురించి నేర్చుకున్న వాళ్ళు అంతగా కనిపించరు. దీంతో సహజంగానే చావా మీద హైప్ లేకపోవడానికి దారి తీసింది.
గత నెల చావా మీద వివాదాలు చుట్టుముడితే కొంత భాగం తీసేసి కొన్ని డైలాగులను మార్చారు. సెన్సార్ చెప్పిన అభ్యంతరాలను పాటించారు. ఇది హిట్ కావడం నార్త్ ట్రేడ్ వర్గాలకు చాలా అవసరం. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అక్కడి థియేటర్లకు పెద్దగా ఫీడింగ్ లేకుండా పోయింది.
స్కై ఫోర్స్, లవ్ యాపా, బ్యాడ్ ఆస్ రవికుమార్ లాంటివి ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. తిరిగి వాటికి చావా జీవం పోస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే రష్మిక మందన్నకు యానిమల్, పుష్ప 2 తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ నమోదవుతుంది.
This post was last modified on February 11, 2025 2:00 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…