Movie News

రష్మిక సినిమాకు బజ్ : అక్కడ ఫుల్… ఇక్కడ డల్!

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చావా మీద పెద్దగా బజ్ కనిపించడం లేదు. బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా దీని మీద ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. అందులోనూ శంభాజి మహారాజ్ కథ కావడంతో జనాలు ఎగబడి చూస్తారనుకున్నారు.

కానీ అడ్వాన్స్ బుకింగ్స్ దానికి తగ్గట్టు లేవు. ట్రేడ్ అనలిస్టులు రెండు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని చెబుతున్నారు కానీ నిజానికీ సంఖ్య రెండు మూడింతలు ఎక్కువగా ఉండాలి. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ఆకర్షణ.

మహారాష్ట్రలో చావాకు అమ్మకాలు బాగున్నాయి కానీ బయట బజ్ ఎందుకు తక్కువుందో చూద్దాం. శంభాజీ మహారాజ్ గురించి మరాఠి వాసులకు తప్ప ఇతర రాష్ట్రాల్లో తెలిసిన వాళ్ళు తక్కువ. ఎలా అంటే మన సైరా నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు గురించి ముంబైలో అవగాహన కలిగిన జనాలు పెద్దగా లేనట్టే శంభాజీ కథలు చదువుకున్న వాళ్ళు మన సైడ్ అంతంత మాత్రమే.

ఛత్రపతి శివాజీ గురించి పిల్లల చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది కాబట్టి ఆ మాత్రం అవగాహన ఉంది కానీ ఇతర మరాఠా వీరుల గురించి నేర్చుకున్న వాళ్ళు అంతగా కనిపించరు. దీంతో సహజంగానే చావా మీద హైప్ లేకపోవడానికి దారి తీసింది.

గత నెల చావా మీద వివాదాలు చుట్టుముడితే కొంత భాగం తీసేసి కొన్ని డైలాగులను మార్చారు. సెన్సార్ చెప్పిన అభ్యంతరాలను పాటించారు. ఇది హిట్ కావడం నార్త్ ట్రేడ్ వర్గాలకు చాలా అవసరం. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అక్కడి థియేటర్లకు పెద్దగా ఫీడింగ్ లేకుండా పోయింది.

స్కై ఫోర్స్, లవ్ యాపా, బ్యాడ్ ఆస్ రవికుమార్ లాంటివి ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. తిరిగి వాటికి చావా జీవం పోస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే రష్మిక మందన్నకు యానిమల్, పుష్ప 2 తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ నమోదవుతుంది.

This post was last modified on February 11, 2025 2:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

26 minutes ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

33 minutes ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

2 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

2 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

4 hours ago