పైరసీ రోజు రోజుకూ ఎంత ప్రమాదకరంగా మారుతోందో ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. రిలీజ్ రోజే మంచి క్వాలిటీతో హెచ్డీ ప్రింట్లు బయటికి వస్తుండడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతి సినిమా ‘గేమ్ చేంజర్’కు పైరసీ వల్ల గట్టి దెబ్బే పడింది. తాజాగా ‘తండేల్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన విషయంలో చాలా సంతోషంగా ఉన్న చిత్ర బృందానికి పైరసీ భూతం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి కూడా క్వాలిటీ పైరసీ ప్రింట్ తొలి రోజే ఆన్ లైన్లోకి వచ్చేసింది. దారుణమైన విషయం ఏంటంటే.. ఏపీలో ఒక చోట ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ పైరసీ వెర్షన్ను ప్రదర్శించారు. ఈ విషయం ‘తండేల్’ నిర్మాతల దృష్టికి కూడా వచ్చింది. ఒక న్యూస్ పోర్టల్లో దీనికి సంబంధించిన న్యూస్ చూసిన నిర్మాత బన్నీ వాసు.. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకల్ల నారాయణరావుకు ఫిర్యాదు చేశారు.
సర్వీస్ సనంబర్ 3066 బస్సులో తండేల్ పైరసీ వెర్షన్ను ప్రదర్శించినట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇది దారుణమని.. దీనికి సంబంధించి కఠిన చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్కు బన్నీ వాసు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో పైరసీ వెర్షన్లు ప్రదర్శించడం కొత్తేమీ కాదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బస్సు సిబ్బంది యథేచ్ఛగా పైరసీ వెర్షన్లను వేసేస్తున్నారు.
మరీ రిలీజై రెండు మూడు రోజులు కాకముందే ఇలా ఆర్టీసీ బస్సులో పైరసీ వెర్షన్ వేయడం అన్నది దారుణం. ఈ పరిణామంతో మొత్తంగా ఆర్టీసీలో కదలిక వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయవాడలో జరిగిన సక్సెస్ టూర్లో భాగంగా పైరసీ చేసిన వాళ్లకు, చూసే వాళ్లకు బన్నీ వాసు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. కొందరు పైరసీలో సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారని.. వాళ్లు ఆ ప్రయత్నాలు మానుకోవాలని వాసు అన్నాడు.
ఇంతకుముందు ‘గీత గోవిందం’ సినిమాను పైరసీ చేసిన వాళ్లు ఇప్పటికీ కేసులతో ఇబ్బంది పడుతున్నారని.. ‘తండేల్’ మూవీని పైరసీ చేసిన వాళ్లు, డౌన్ లోడ్ చేసిన చూసిన వాళ్లు ఎవ్వరినీ తాను వదిలిపెట్టనని.. ప్రస్తుతం రిలీజ్, ప్రమోషన్ల హడావుడిలో ఉన్నామని.. ఇలా చేసిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెడతామని వాసు హెచ్చరించాడు.
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…