తెలుగులో రాజమౌళి లాగే బాలీవుడ్లో ఇప్పటిదాకా అపజయమే ఎరుగని ఒక దర్శకుడున్నాడు. ఐతే ఆయనేమీ రాజమౌళిలా మాస్ మసాలా సినిమాలతో మొదలుపెట్టి ఈవెంట్ చిత్రాలకు మళ్లిన దర్శకుడు కాదు. సందేశం, వినోదం మిళితమైన కథలను అద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేస్తూ.. చాలా తక్కువ సినిమాలతోనే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆ వ్యక్తే రాజ్ కుమార్ హిరాని.
ఇండియన్ సినిమాలో ఉన్న ప్రతి నటుడూ, టెక్నీషియన్ ఒక్కసారైనా కలిసి పని చేయాలని ఆశించే దర్శకుల్లో హిరాని ఒకడనడంలో సందేహం లేదు. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ మొదలుకుని.. ‘డంకీ’ వరకు హిరాని తీసిన ప్రతి చిత్రం విజయవంతమైంది. ఇప్పుడాయన ‘మున్నాభాయ్’ సిరీస్లో మూడో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటించబోతున్నాడన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్రాంజైజీ సినిమాల్లో ‘మున్నాభాయ్’ ఒకటి. సంజయ్ దత్ కెరీర్ను గొప్ప మలుపు తిప్పుతూ రాజ్ కుమార్ హిరాని రూపొందించిన ‘మున్నాభాయ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. దీన్నే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తే అది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత హిరాని ‘లగేరహో మున్నాభాయ్’ తీస్తే అది కూడా ఘనవిజయం సాధించింది.
ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘మున్నాభాయ్-3’ తీయాలని హిరాని-సంజు ఎప్పుడో అనుకున్నారు. కానీ ఇన్నేళ్లు అది పట్టాలెక్కబోతోంది. మూడోసారి మున్నాభాయ్గా సంజయ్ దత్ అలరించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రంలో కీలక పాత్రకు నాగార్జునను అడిగారని, ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం. నాగ్ ఈ మధ్య వరుసగా ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు.
‘కుబేర’లో ధనుష్తో, ‘కూలీ’లో రజినీకాంత్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘మున్నాభాయ్-3’లో సంజుతో జట్టు కట్టబోతున్నారట. పాత్ర ఎలాంటిదైనా హిరాని లాంటి గొప్ప దర్శకుడి సినిమాలో నాగ్ నటిస్తున్నాడంటే అభిమానుల ఆనందానికి కొదవేముంది? ఈ వార్త నిజమైతే టాలీవుడ్కు అది హ్యాపీ న్యూసే.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…