కొత్త సినిమాల రిలీజ్ దగ్గర పడే సమయానికి డిస్ట్రిబ్యూటర్లు మారడం.. కొన్ని ఏరియాల్లో ఒకరి నుంచి ఇంకొకరికి సినిమా చేతులు మారడం మామూలే. అనుకున్న ప్రకారం డీల్స్ జరగనపుడు కొన్నిసార్లు నిర్మాతలు వెనక్కి తగ్గుతుంటారు. కొన్నిసార్లు బయ్యర్లు వెనుకంజ వేస్తుంటారు. కానీ ఓటీటీ డీల్స్ విషయంలో ఇప్పటిదాకా ఇలాంటి మార్పులు జరిగినట్లు వార్తలేమీ రాలేదు.
ఇప్పుడు ఓ కొత్త సినిమా ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేతి నుంచి మరో సంస్థ చేతికి వెళ్లిపోయింది. ఈ అనూహ్య పరిణామం కోలీవుడ్లో చోటు చేసుకుంది. జయం రవి హీరోగా తెరకెక్కిన ‘భూమి’ సినిమా.. హాట్ స్టార్ వాళ్ల చేతి నుంచి సన్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ చిత్ర నిర్మాత ముందు హాట్ స్టార్ వాళ్లకే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మాడు. కానీ ముందు అనుకున్న ప్రకారం హాట్ స్టార్ డబ్బులు చెల్లించకుండా.. బేరానికి దిగడంతో ఆ ఒప్పందాన్ని నిర్మాత రద్దు చేసుకున్నాడు.
ఈ సినిమాను సన్ గ్రూప్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. డిజిటల్ ప్రిమియర్ కంటే ముందు టీవీల్లో ఈ సినిమా ప్రసారం కాబోతోంది. దీపావళి రోజు సన్ టీవీలో ఈ చిత్రాన్ని ప్రిమియర్గా వేయనున్నారు. తర్వాతి రోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సినిమా అందుబాటులోకి వస్తుంది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో విడుదలవుతున్న తొలి పేరున్న సినిమా ఇదే కావడం విశేషం.
‘భూమి’ రైతుల సమస్యల నేపథ్యంలో సాగే సినిమా. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్.. తొలిసారిగా తమిళంలో నటించిన చిత్రమిది. ఇంతకుముందు జయం రవితోనే ‘బోగన్’ సినిమా తీసిన లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో రవితేజతో రీమేక్ చేసేందుకు ఒప్పందం కుదిరి కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్న లక్ష్మణ్.. చివరికి రవితేజ హ్యాండివ్వడంతో తిరిగి కోలీవుడ్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తీసిన చిత్రమే భూమి.
This post was last modified on October 21, 2020 10:30 am
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…