Movie News

ఓటీటీ ట్విస్ట్.. ఆ సినిమా అక్కడి నుంచి ఇక్కడికి

కొత్త సినిమాల రిలీజ్ దగ్గర పడే సమయానికి డిస్ట్రిబ్యూటర్లు మారడం.. కొన్ని ఏరియాల్లో ఒకరి నుంచి ఇంకొకరికి సినిమా చేతులు మారడం మామూలే. అనుకున్న ప్రకారం డీల్స్ జరగనపుడు కొన్నిసార్లు నిర్మాతలు వెనక్కి తగ్గుతుంటారు. కొన్నిసార్లు బయ్యర్లు వెనుకంజ వేస్తుంటారు. కానీ ఓటీటీ డీల్స్ విషయంలో ఇప్పటిదాకా ఇలాంటి మార్పులు జరిగినట్లు వార్తలేమీ రాలేదు.

ఇప్పుడు ఓ కొత్త సినిమా ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేతి నుంచి మరో సంస్థ చేతికి వెళ్లిపోయింది. ఈ అనూహ్య పరిణామం కోలీవుడ్లో చోటు చేసుకుంది. జయం రవి హీరోగా తెరకెక్కిన ‘భూమి’ సినిమా.. హాట్ స్టార్ వాళ్ల చేతి నుంచి సన్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ చిత్ర నిర్మాత ముందు హాట్ స్టార్ వాళ్లకే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మాడు. కానీ ముందు అనుకున్న ప్రకారం హాట్ స్టార్ డబ్బులు చెల్లించకుండా.. బేరానికి దిగడంతో ఆ ఒప్పందాన్ని నిర్మాత రద్దు చేసుకున్నాడు.

ఈ సినిమాను సన్ గ్రూప్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. డిజిటల్ ప్రిమియర్ కంటే ముందు టీవీల్లో ఈ సినిమా ప్రసారం కాబోతోంది. దీపావళి రోజు సన్ టీవీలో ఈ చిత్రాన్ని ప్రిమియర్‌గా వేయనున్నారు. తర్వాతి రోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సినిమా అందుబాటులోకి వస్తుంది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో విడుదలవుతున్న తొలి పేరున్న సినిమా ఇదే కావడం విశేషం.

‘భూమి’ రైతుల సమస్యల నేపథ్యంలో సాగే సినిమా. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్.. తొలిసారిగా తమిళంలో నటించిన చిత్రమిది. ఇంతకుముందు జయం రవితోనే ‘బోగన్’ సినిమా తీసిన లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో రవితేజతో రీమేక్ చేసేందుకు ఒప్పందం కుదిరి కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్న లక్ష్మణ్.. చివరికి రవితేజ హ్యాండివ్వడంతో తిరిగి కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తీసిన చిత్రమే భూమి.

This post was last modified on October 21, 2020 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

10 minutes ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

2 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

5 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 hours ago