Movie News

ఓటీటీ ట్విస్ట్.. ఆ సినిమా అక్కడి నుంచి ఇక్కడికి

కొత్త సినిమాల రిలీజ్ దగ్గర పడే సమయానికి డిస్ట్రిబ్యూటర్లు మారడం.. కొన్ని ఏరియాల్లో ఒకరి నుంచి ఇంకొకరికి సినిమా చేతులు మారడం మామూలే. అనుకున్న ప్రకారం డీల్స్ జరగనపుడు కొన్నిసార్లు నిర్మాతలు వెనక్కి తగ్గుతుంటారు. కొన్నిసార్లు బయ్యర్లు వెనుకంజ వేస్తుంటారు. కానీ ఓటీటీ డీల్స్ విషయంలో ఇప్పటిదాకా ఇలాంటి మార్పులు జరిగినట్లు వార్తలేమీ రాలేదు.

ఇప్పుడు ఓ కొత్త సినిమా ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేతి నుంచి మరో సంస్థ చేతికి వెళ్లిపోయింది. ఈ అనూహ్య పరిణామం కోలీవుడ్లో చోటు చేసుకుంది. జయం రవి హీరోగా తెరకెక్కిన ‘భూమి’ సినిమా.. హాట్ స్టార్ వాళ్ల చేతి నుంచి సన్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ చిత్ర నిర్మాత ముందు హాట్ స్టార్ వాళ్లకే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మాడు. కానీ ముందు అనుకున్న ప్రకారం హాట్ స్టార్ డబ్బులు చెల్లించకుండా.. బేరానికి దిగడంతో ఆ ఒప్పందాన్ని నిర్మాత రద్దు చేసుకున్నాడు.

ఈ సినిమాను సన్ గ్రూప్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. డిజిటల్ ప్రిమియర్ కంటే ముందు టీవీల్లో ఈ సినిమా ప్రసారం కాబోతోంది. దీపావళి రోజు సన్ టీవీలో ఈ చిత్రాన్ని ప్రిమియర్‌గా వేయనున్నారు. తర్వాతి రోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సినిమా అందుబాటులోకి వస్తుంది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో విడుదలవుతున్న తొలి పేరున్న సినిమా ఇదే కావడం విశేషం.

‘భూమి’ రైతుల సమస్యల నేపథ్యంలో సాగే సినిమా. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్.. తొలిసారిగా తమిళంలో నటించిన చిత్రమిది. ఇంతకుముందు జయం రవితోనే ‘బోగన్’ సినిమా తీసిన లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో రవితేజతో రీమేక్ చేసేందుకు ఒప్పందం కుదిరి కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్న లక్ష్మణ్.. చివరికి రవితేజ హ్యాండివ్వడంతో తిరిగి కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తీసిన చిత్రమే భూమి.

This post was last modified on October 21, 2020 10:30 am

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

7 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

10 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

10 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

10 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

11 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

12 hours ago