కొత్త సినిమాల రిలీజ్ దగ్గర పడే సమయానికి డిస్ట్రిబ్యూటర్లు మారడం.. కొన్ని ఏరియాల్లో ఒకరి నుంచి ఇంకొకరికి సినిమా చేతులు మారడం మామూలే. అనుకున్న ప్రకారం డీల్స్ జరగనపుడు కొన్నిసార్లు నిర్మాతలు వెనక్కి తగ్గుతుంటారు. కొన్నిసార్లు బయ్యర్లు వెనుకంజ వేస్తుంటారు. కానీ ఓటీటీ డీల్స్ విషయంలో ఇప్పటిదాకా ఇలాంటి మార్పులు జరిగినట్లు వార్తలేమీ రాలేదు.
ఇప్పుడు ఓ కొత్త సినిమా ఒక టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ చేతి నుంచి మరో సంస్థ చేతికి వెళ్లిపోయింది. ఈ అనూహ్య పరిణామం కోలీవుడ్లో చోటు చేసుకుంది. జయం రవి హీరోగా తెరకెక్కిన ‘భూమి’ సినిమా.. హాట్ స్టార్ వాళ్ల చేతి నుంచి సన్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ చిత్ర నిర్మాత ముందు హాట్ స్టార్ వాళ్లకే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు అమ్మాడు. కానీ ముందు అనుకున్న ప్రకారం హాట్ స్టార్ డబ్బులు చెల్లించకుండా.. బేరానికి దిగడంతో ఆ ఒప్పందాన్ని నిర్మాత రద్దు చేసుకున్నాడు.
ఈ సినిమాను సన్ గ్రూప్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. డిజిటల్ ప్రిమియర్ కంటే ముందు టీవీల్లో ఈ సినిమా ప్రసారం కాబోతోంది. దీపావళి రోజు సన్ టీవీలో ఈ చిత్రాన్ని ప్రిమియర్గా వేయనున్నారు. తర్వాతి రోజు నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సినిమా అందుబాటులోకి వస్తుంది. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో విడుదలవుతున్న తొలి పేరున్న సినిమా ఇదే కావడం విశేషం.
‘భూమి’ రైతుల సమస్యల నేపథ్యంలో సాగే సినిమా. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్.. తొలిసారిగా తమిళంలో నటించిన చిత్రమిది. ఇంతకుముందు జయం రవితోనే ‘బోగన్’ సినిమా తీసిన లక్ష్మణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ‘బోగన్’ చిత్రాన్ని తెలుగులో రవితేజతో రీమేక్ చేసేందుకు ఒప్పందం కుదిరి కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్న లక్ష్మణ్.. చివరికి రవితేజ హ్యాండివ్వడంతో తిరిగి కోలీవుడ్కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తీసిన చిత్రమే భూమి.
This post was last modified on October 21, 2020 10:30 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…