కొత్త సినిమాలకు హిట్ టాక్ వస్తే నిర్మాతలు ఆనందిస్తుండగానే గంటల వ్యవధిలో పైరసీ బారిన పడిందనే వార్త వాళ్ళను ఆందోళనకు గురి చేస్తోంది. ఎప్పుడూ లేనిది ఈ భూతం తాజాగా హెచ్డి రూపం సంతరించుకోవడం పరిశ్రమకు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. నూతన సంవత్సరంలో గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా పైరసీ బారిన పడిన సంఖ్య అప్పుడే నాలుగైదుకు చేరుకుంది.
దీన్ని బన్నీ వాస్ సీరియస్ గా తీసుకున్నారు. పైరసి చేసినవాళ్ళను వదలమని, గీతా గోవిందం కేసులో ఉన్న వాళ్ళు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారని, గీతా ఆర్ట్స్ సినిమాలను చౌర్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ డౌన్లోడ్ చేసుకుని చూసినవాళ్లను సైతం వదలనని చెప్పడం మరో ట్విస్టు. నిజానికి పైరసీ మూలలను వెతికి పట్టుకోవడమే ఇండస్ట్రీకి పెద్ద సవాల్ గా మారింది. బోలెడు వెబ్ సైట్స్ తో పాటు తాజాగా వాట్సాప్, టెలిగ్రామ్ ఇలా రకరకాల యాప్స్ రూపంలో లింకులు షేర్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది.
వీళ్లందరినీ ట్రేస్ చేయడం అంత సులభం కాదు. అసలు చేస్తున్నవి ఎవరు, ఏ దేశంలో, ఎక్కడి నుంచి చేస్తున్నారో పసిగట్టి అరికడితే డౌన్లోడ్ చేసుకునవాళ్లు ఉండరుగా. దశాబ్దాలుగా పీడిస్తున్న ఈ సమస్య ఇప్పటికప్పుడు కాకపోయినా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలి.
ఆ మధ్య ఈటివి తమ యాప్ కంటెంట్ ని పైరసీ చేయలేని విధంగా కొన్ని చర్యలు తీసుకుంది. ఫలితం వచ్చింది కూడా. కానీ కథ మళ్ళీ మొదటికే రావడం వేరే విషయం. ఇలాంటి కట్టడి చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉండాలి. తండేల్ ఒక్కటే కాదు భవిష్యత్తులో ఎన్నో సినిమాలు పైరసీ బారిన పడకుండా చూసుకోవాలంటే ఒకరిద్దరితో జరిగే పని కాదు.
కలిసికట్టుగా పోరాటం చేయాలి. లేకపోతే జరగబోయే నష్టం పదులు కాదు వందల కోట్లలో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూసేవాళ్లనేమో కానీ ముందు చేసేవాళ్లను పట్టుకుంటే బన్నీ వాస్ కు మద్దతుగా నిలబడేందుకు టాలీవుడ్డే కాదు అన్ని పరిశ్రమలు మద్దతిస్తాయి.
This post was last modified on February 10, 2025 2:14 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…