తమిళ్ రాకర్స్.. ఈ పేరు చెబితే కోలీవుడ్ వణికిపోతుంది. ఆ వెబ్ సైట్ తమిళ సినీ పరిశ్రమకు చేసిన నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు దశాబ్దంన్నరగా ఆ వెబ్ సైట్ కోలీవుడ్ జనాలను వేధిస్తోంది. కొత్త సినిమా ఇలా రిలీజ్ కావడం ఆలస్యం.. కొన్ని గంటల్లో ఆ వెబ్ సైట్లో ప్రత్యక్షం అయిపోతుంది. సినిమా పైరసీ కాకుండా ఎన్ని చర్యలు చేపట్టినా.. థియేటర్లను ఎంతగా కట్టడి చేసినా.. ఆ వెబ్ సైట్ నిర్వాహకులు మాత్రం ఎలాగోలా పైరసీ వెర్షన్ను బయటికి తెచ్చేస్తారు.
ఈ వెబ్ సైట్ మీద సైబర్ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. అత్యున్నత స్థాయిలో దాన్ని నియంత్రించేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ వెబ్ సైట్ను ఇంటర్నెట్లో శోధిస్తే పని చేయట్లేదనే సమాచారమే కనిపిస్తుంది. కానీ ఆ వెబ్ సైట్ ద్వారా పైరసీ సినిమాలు మాత్రం ఆగవు.
కొన్నేళ్లుగా తన సబ్స్క్రైబర్లను మెయిల్ ద్వారా పైరసీ లింకులు పంపించి వాళ్లను ఎంగేజ్ చేస్తూ వస్తోందా వెబ్ సైట్. ఐతే ఇప్పటిదాకా కోలీవుడ్ నుంచి విశాల్ సహా ఎంతోమంది పెద్దలు ఆ వెబ్ సైట్ను నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. ఇప్పుడు అమేజాన్ ప్రైమ్ దాని పని పట్టేసింది. ప్రైమ్లో వచ్చే కొత్త సినిమాలన్నింటినీ కూడా ఈ వెబ్ సైట్ పైరసీ చేసి తన సబ్స్క్రైబర్లకు అందిస్తున్నట్లు.. తమకు భారీగా నష్టం చేకూరుస్తున్నట్లు తెలుసుకున్న ప్రైమ్ టీం.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి ఈ వ్యవహారాన్ని డీల్ చేసింది.
వాళ్లు ఆ వెబ్ సైట్ సర్వర్లన్నింటినీ బ్లాక్ చేశారు. దీంతో తమిళ్ రాకర్స్కు గట్టి దెబ్బ తగిలింది. ఇకపై కొత్త సినిమాల పైరసీ వెర్షన్లు అందించలేమని.. తమ సర్వర్లన్నీ బ్లాక్ అయిపోయాయని సబ్స్క్రైబర్లకు తమిళ్ రాకర్స్ మెయిల్స్ పెట్టేసింది. ఇలా ఇంతకుముందెన్నడూ జరిగింది లేదు. మొత్తానికి తమిళ సినీ పరిశ్రమ ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాని పనిని అమేజాన్ చేసిందంటూ దానిపై ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on October 21, 2020 9:59 am
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…