ఆర్యలో అల్లు అర్జున్ డైలాగు ఒకటుంది. హీరోయిన్ కు తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే క్రమంలో దాచుకోలేనంత ఉందని చెబుతాడు. అచ్చంగా ఇదే సుకుమార్ నిజ జీవితంలో ప్రదర్శించారు. ఇవాళ జరిగిన పుష్ప 2 ది రూల్ థాంక్స్ మీట్ లో ఈ సన్నివేశం కనిపించింది.
దేవిశ్రీప్రసాద్ పేరుని తన పేరుతో పాటు జోడించాలని ఉందని, తను లేకుండా భవిష్యత్తులో సినిమా చేయలేనేమో అని సందేహం వ్యక్తం చేస్తూ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని బహిరంగంగా చెప్పుకున్నారు. జగడం, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 1 ది రైజ్ ఇలా వీళ్ళ ప్రయాణం దేవికి జాతీయ అవార్డు వచ్చేదాకా ఇంకా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ తన ఇంటి దగ్గర ఇద్దరు వృద్ధులు కలిసి పుష్పలో బన్నీ అదరగొట్టేశాడని, ఇంకా చెప్పాలంటే ఎస్వి రంగారావు లేని లోటు తీర్చినట్టు అయ్యిందని వాళ్ళు చెప్పడం విని ఆశ్చర్యానికి గురయ్యాయని సుకుమార్ వివరించారు. అయితే ఎస్విఆర్ కు డాన్సులు, ఫైట్లు రావు కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే బన్నీనే రెండు మెట్లు పైనున్నాడని అర్థం వచ్చేలా ఆ ఇద్దరు కామెంట్ చేశారని వివరించారు.
ఇదేదో ట్రోలింగ్ కు అవకాశం ఇవ్వడానికో, లేక మహానటుడిని పోల్చడానికో కాదని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఈ ముచ్చట్లు పంచుకునే సందర్భం సుకుమార్ కు రాలేదు. రెండు నెలల తర్వాత కుదిరింది.
ఈ రోజు పుష్ప 2 వేడుకతో ఇక అన్ని ప్రమోషన్లకు ముగింపు పలికినట్టే. ఇటీవలే రీ లోడెడ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మిలియన్ల వ్యూస్ తో కొత్త రికార్డులకు పరుగులు పెడుతోంది. అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకున్నాక ఓటిటిలో రావడంతో థియేట్రికల్ గా చాలా ప్లస్ అయ్యింది.
వసూళ్ల లెక్కల గురించి ఎక్కువ ప్రస్తావన జరగకపోవడం గమనార్హం. సుకుమార్ చెప్పిన మాటలల్లో లోతైన అర్థం తీసుకుంటే రామ్ చరణ్ 17కి దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడం, పుష్ప 3 ది ర్యాంపేజ్ కి ఛాన్స్ ఉండటం కనిపిస్తోంది. ఏది నిజమైనా అభిమానులకది పండగ లాంటి శుభవార్తే.
This post was last modified on February 8, 2025 10:31 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…