ఆర్యలో అల్లు అర్జున్ డైలాగు ఒకటుంది. హీరోయిన్ కు తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే క్రమంలో దాచుకోలేనంత ఉందని చెబుతాడు. అచ్చంగా ఇదే సుకుమార్ నిజ జీవితంలో ప్రదర్శించారు. ఇవాళ జరిగిన పుష్ప 2 ది రూల్ థాంక్స్ మీట్ లో ఈ సన్నివేశం కనిపించింది.
దేవిశ్రీప్రసాద్ పేరుని తన పేరుతో పాటు జోడించాలని ఉందని, తను లేకుండా భవిష్యత్తులో సినిమా చేయలేనేమో అని సందేహం వ్యక్తం చేస్తూ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని బహిరంగంగా చెప్పుకున్నారు. జగడం, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 1 ది రైజ్ ఇలా వీళ్ళ ప్రయాణం దేవికి జాతీయ అవార్డు వచ్చేదాకా ఇంకా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ తన ఇంటి దగ్గర ఇద్దరు వృద్ధులు కలిసి పుష్పలో బన్నీ అదరగొట్టేశాడని, ఇంకా చెప్పాలంటే ఎస్వి రంగారావు లేని లోటు తీర్చినట్టు అయ్యిందని వాళ్ళు చెప్పడం విని ఆశ్చర్యానికి గురయ్యాయని సుకుమార్ వివరించారు. అయితే ఎస్విఆర్ కు డాన్సులు, ఫైట్లు రావు కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే బన్నీనే రెండు మెట్లు పైనున్నాడని అర్థం వచ్చేలా ఆ ఇద్దరు కామెంట్ చేశారని వివరించారు.
ఇదేదో ట్రోలింగ్ కు అవకాశం ఇవ్వడానికో, లేక మహానటుడిని పోల్చడానికో కాదని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఈ ముచ్చట్లు పంచుకునే సందర్భం సుకుమార్ కు రాలేదు. రెండు నెలల తర్వాత కుదిరింది.
ఈ రోజు పుష్ప 2 వేడుకతో ఇక అన్ని ప్రమోషన్లకు ముగింపు పలికినట్టే. ఇటీవలే రీ లోడెడ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మిలియన్ల వ్యూస్ తో కొత్త రికార్డులకు పరుగులు పెడుతోంది. అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకున్నాక ఓటిటిలో రావడంతో థియేట్రికల్ గా చాలా ప్లస్ అయ్యింది.
వసూళ్ల లెక్కల గురించి ఎక్కువ ప్రస్తావన జరగకపోవడం గమనార్హం. సుకుమార్ చెప్పిన మాటలల్లో లోతైన అర్థం తీసుకుంటే రామ్ చరణ్ 17కి దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడం, పుష్ప 3 ది ర్యాంపేజ్ కి ఛాన్స్ ఉండటం కనిపిస్తోంది. ఏది నిజమైనా అభిమానులకది పండగ లాంటి శుభవార్తే.
This post was last modified on February 8, 2025 10:31 pm
హరిహర వీరమల్లు షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేయడంతో ఇప్పుడు అభిమానుల చూపు ఓజి వైపు వెళ్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు…
తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు…
తెలుగు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. ఫలితంగా మంగళవారం అర్థరాత్రి నుంచి జరగనున్న ఆర్టీసీ సమ్మె…
సీఎంగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న కాంక్షతో వడివడిగా ముందుకు సాగుతున్న చంద్రబాబు.. అదే సమయంలో తాను తీసుకుంటున్న నిర్ణయాల్లో వచ్చే…
తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మరోమారు మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ప్రత్యేకించి సీఎం ఎనుముల…