ఆర్యలో అల్లు అర్జున్ డైలాగు ఒకటుంది. హీరోయిన్ కు తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే క్రమంలో దాచుకోలేనంత ఉందని చెబుతాడు. అచ్చంగా ఇదే సుకుమార్ నిజ జీవితంలో ప్రదర్శించారు. ఇవాళ జరిగిన పుష్ప 2 ది రూల్ థాంక్స్ మీట్ లో ఈ సన్నివేశం కనిపించింది.
దేవిశ్రీప్రసాద్ పేరుని తన పేరుతో పాటు జోడించాలని ఉందని, తను లేకుండా భవిష్యత్తులో సినిమా చేయలేనేమో అని సందేహం వ్యక్తం చేస్తూ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని బహిరంగంగా చెప్పుకున్నారు. జగడం, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 1 ది రైజ్ ఇలా వీళ్ళ ప్రయాణం దేవికి జాతీయ అవార్డు వచ్చేదాకా ఇంకా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ తన ఇంటి దగ్గర ఇద్దరు వృద్ధులు కలిసి పుష్పలో బన్నీ అదరగొట్టేశాడని, ఇంకా చెప్పాలంటే ఎస్వి రంగారావు లేని లోటు తీర్చినట్టు అయ్యిందని వాళ్ళు చెప్పడం విని ఆశ్చర్యానికి గురయ్యాయని సుకుమార్ వివరించారు. అయితే ఎస్విఆర్ కు డాన్సులు, ఫైట్లు రావు కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే బన్నీనే రెండు మెట్లు పైనున్నాడని అర్థం వచ్చేలా ఆ ఇద్దరు కామెంట్ చేశారని వివరించారు.
ఇదేదో ట్రోలింగ్ కు అవకాశం ఇవ్వడానికో, లేక మహానటుడిని పోల్చడానికో కాదని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఈ ముచ్చట్లు పంచుకునే సందర్భం సుకుమార్ కు రాలేదు. రెండు నెలల తర్వాత కుదిరింది.
ఈ రోజు పుష్ప 2 వేడుకతో ఇక అన్ని ప్రమోషన్లకు ముగింపు పలికినట్టే. ఇటీవలే రీ లోడెడ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. మిలియన్ల వ్యూస్ తో కొత్త రికార్డులకు పరుగులు పెడుతోంది. అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకున్నాక ఓటిటిలో రావడంతో థియేట్రికల్ గా చాలా ప్లస్ అయ్యింది.
వసూళ్ల లెక్కల గురించి ఎక్కువ ప్రస్తావన జరగకపోవడం గమనార్హం. సుకుమార్ చెప్పిన మాటలల్లో లోతైన అర్థం తీసుకుంటే రామ్ చరణ్ 17కి దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడం, పుష్ప 3 ది ర్యాంపేజ్ కి ఛాన్స్ ఉండటం కనిపిస్తోంది. ఏది నిజమైనా అభిమానులకది పండగ లాంటి శుభవార్తే.
This post was last modified on February 8, 2025 10:31 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…