అక్కినేని నాగచైతన్య-సమంతల జోడీని చూస్తే ముచ్చటేసేది అభిమానులకు. టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్లో ఒకరిగా వీరిని చూసేవారు. అలాంటి జంట విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్. ఈ విషయాన్ని చాన్నాళ్ల పాటు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంలో అభిమానుల్లో ఓ వర్గం చైతూను, ఇంకో వర్గం సమంతను నిందించారు. అసలు విడాకులకు కారణాలేంటి అనే చర్చ చాన్నాళ్ల పాటు సాగింది.
ఇప్పుడు చైతూ, సమంతల్లాగే మూవ్ ఆన్ అయిపోయి ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇలాంటి సందర్భంలో చైతూ విడాకుల గురించి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత పేరెత్తకుండానే తన తొలి వివాహ బంధం నిలబడకపోవడం గురించి చైతూ మాట్లాడాడు. విడాకులు ఎంతో బాధాకర నిర్ణయమని.. పరస్పర అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా అతను మాట్లాడాడు.‘‘నేనొక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. భార్యాభర్తలు విడిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాని వల్ల నేనెంతో బాధను అనుభించాను కాబట్టి.. నా జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అంత తేలిక కాదు. వెయ్యిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటా. విడాకుల నిర్ణయం ఒక్క రోజులో తీసుకుంది కాదు. చాన్నాళ్ల పాటు దాని గురించి ఆలోచించాం.
కచ్చితంగా అది బాధ పెట్టే నిర్ణయం. కానీ ఏది జరిగినా ఒక కారణంతోనే జరుగుతుంది. అది ఇద్దరి మంచికే అని నా భావన. అందుకే ఇద్దరం కలిసి పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో మంచి జరుగుతుందని అనుకున్నాం. ఆ ప్రకారమే జరుగుతోందని అనుకుంటున్నా’’ అని చైతూ చెప్పాడు.
మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఆసక్తికర ప్రశ్న వేశాడు చైతూ. రేప్పొద్దున మీ పిల్లలు ఇదే వృత్తిలోకి వస్తామంటే ఆపుతారా.. అలాగే నటన మీద తనకు ఆసక్తి ఉందని అంటే తన తండ్రి ఎందుకు కాదని అంటారని.. ఇందులో ఆయన తప్పైనా, తన తప్పైనా ఉందా అని చైతూ ప్రశ్నించాడు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…