అక్కినేని నాగచైతన్య-సమంతల జోడీని చూస్తే ముచ్చటేసేది అభిమానులకు. టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్లో ఒకరిగా వీరిని చూసేవారు. అలాంటి జంట విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్. ఈ విషయాన్ని చాన్నాళ్ల పాటు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంలో అభిమానుల్లో ఓ వర్గం చైతూను, ఇంకో వర్గం సమంతను నిందించారు. అసలు విడాకులకు కారణాలేంటి అనే చర్చ చాన్నాళ్ల పాటు సాగింది.
ఇప్పుడు చైతూ, సమంతల్లాగే మూవ్ ఆన్ అయిపోయి ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇలాంటి సందర్భంలో చైతూ విడాకుల గురించి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత పేరెత్తకుండానే తన తొలి వివాహ బంధం నిలబడకపోవడం గురించి చైతూ మాట్లాడాడు. విడాకులు ఎంతో బాధాకర నిర్ణయమని.. పరస్పర అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా అతను మాట్లాడాడు.‘‘నేనొక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. భార్యాభర్తలు విడిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాని వల్ల నేనెంతో బాధను అనుభించాను కాబట్టి.. నా జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అంత తేలిక కాదు. వెయ్యిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటా. విడాకుల నిర్ణయం ఒక్క రోజులో తీసుకుంది కాదు. చాన్నాళ్ల పాటు దాని గురించి ఆలోచించాం.
కచ్చితంగా అది బాధ పెట్టే నిర్ణయం. కానీ ఏది జరిగినా ఒక కారణంతోనే జరుగుతుంది. అది ఇద్దరి మంచికే అని నా భావన. అందుకే ఇద్దరం కలిసి పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో మంచి జరుగుతుందని అనుకున్నాం. ఆ ప్రకారమే జరుగుతోందని అనుకుంటున్నా’’ అని చైతూ చెప్పాడు.
మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఆసక్తికర ప్రశ్న వేశాడు చైతూ. రేప్పొద్దున మీ పిల్లలు ఇదే వృత్తిలోకి వస్తామంటే ఆపుతారా.. అలాగే నటన మీద తనకు ఆసక్తి ఉందని అంటే తన తండ్రి ఎందుకు కాదని అంటారని.. ఇందులో ఆయన తప్పైనా, తన తప్పైనా ఉందా అని చైతూ ప్రశ్నించాడు.
This post was last modified on February 8, 2025 6:55 pm
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…