అక్కినేని నాగచైతన్య-సమంతల జోడీని చూస్తే ముచ్చటేసేది అభిమానులకు. టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్లో ఒకరిగా వీరిని చూసేవారు. అలాంటి జంట విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్. ఈ విషయాన్ని చాన్నాళ్ల పాటు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంలో అభిమానుల్లో ఓ వర్గం చైతూను, ఇంకో వర్గం సమంతను నిందించారు. అసలు విడాకులకు కారణాలేంటి అనే చర్చ చాన్నాళ్ల పాటు సాగింది.
ఇప్పుడు చైతూ, సమంతల్లాగే మూవ్ ఆన్ అయిపోయి ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇలాంటి సందర్భంలో చైతూ విడాకుల గురించి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత పేరెత్తకుండానే తన తొలి వివాహ బంధం నిలబడకపోవడం గురించి చైతూ మాట్లాడాడు. విడాకులు ఎంతో బాధాకర నిర్ణయమని.. పరస్పర అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా అతను మాట్లాడాడు.‘‘నేనొక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. భార్యాభర్తలు విడిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాని వల్ల నేనెంతో బాధను అనుభించాను కాబట్టి.. నా జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అంత తేలిక కాదు. వెయ్యిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటా. విడాకుల నిర్ణయం ఒక్క రోజులో తీసుకుంది కాదు. చాన్నాళ్ల పాటు దాని గురించి ఆలోచించాం.
కచ్చితంగా అది బాధ పెట్టే నిర్ణయం. కానీ ఏది జరిగినా ఒక కారణంతోనే జరుగుతుంది. అది ఇద్దరి మంచికే అని నా భావన. అందుకే ఇద్దరం కలిసి పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో మంచి జరుగుతుందని అనుకున్నాం. ఆ ప్రకారమే జరుగుతోందని అనుకుంటున్నా’’ అని చైతూ చెప్పాడు.
మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఆసక్తికర ప్రశ్న వేశాడు చైతూ. రేప్పొద్దున మీ పిల్లలు ఇదే వృత్తిలోకి వస్తామంటే ఆపుతారా.. అలాగే నటన మీద తనకు ఆసక్తి ఉందని అంటే తన తండ్రి ఎందుకు కాదని అంటారని.. ఇందులో ఆయన తప్పైనా, తన తప్పైనా ఉందా అని చైతూ ప్రశ్నించాడు.
This post was last modified on February 8, 2025 6:55 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…