అక్కినేని నాగచైతన్య-సమంతల జోడీని చూస్తే ముచ్చటేసేది అభిమానులకు. టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్లో ఒకరిగా వీరిని చూసేవారు. అలాంటి జంట విడిపోవడం అభిమానులకు పెద్ద షాక్. ఈ విషయాన్ని చాన్నాళ్ల పాటు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంలో అభిమానుల్లో ఓ వర్గం చైతూను, ఇంకో వర్గం సమంతను నిందించారు. అసలు విడాకులకు కారణాలేంటి అనే చర్చ చాన్నాళ్ల పాటు సాగింది.
ఇప్పుడు చైతూ, సమంతల్లాగే మూవ్ ఆన్ అయిపోయి ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. ఇలాంటి సందర్భంలో చైతూ విడాకుల గురించి ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంత పేరెత్తకుండానే తన తొలి వివాహ బంధం నిలబడకపోవడం గురించి చైతూ మాట్లాడాడు. విడాకులు ఎంతో బాధాకర నిర్ణయమని.. పరస్పర అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు.
ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా అతను మాట్లాడాడు.‘‘నేనొక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. భార్యాభర్తలు విడిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాని వల్ల నేనెంతో బాధను అనుభించాను కాబట్టి.. నా జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోవాలంటే అంత తేలిక కాదు. వెయ్యిసార్లు ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటా. విడాకుల నిర్ణయం ఒక్క రోజులో తీసుకుంది కాదు. చాన్నాళ్ల పాటు దాని గురించి ఆలోచించాం.
కచ్చితంగా అది బాధ పెట్టే నిర్ణయం. కానీ ఏది జరిగినా ఒక కారణంతోనే జరుగుతుంది. అది ఇద్దరి మంచికే అని నా భావన. అందుకే ఇద్దరం కలిసి పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో మంచి జరుగుతుందని అనుకున్నాం. ఆ ప్రకారమే జరుగుతోందని అనుకుంటున్నా’’ అని చైతూ చెప్పాడు.
మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో నెపోటిజం గురించి ప్రశ్న ఎదురు కాగా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని ఆసక్తికర ప్రశ్న వేశాడు చైతూ. రేప్పొద్దున మీ పిల్లలు ఇదే వృత్తిలోకి వస్తామంటే ఆపుతారా.. అలాగే నటన మీద తనకు ఆసక్తి ఉందని అంటే తన తండ్రి ఎందుకు కాదని అంటారని.. ఇందులో ఆయన తప్పైనా, తన తప్పైనా ఉందా అని చైతూ ప్రశ్నించాడు.
This post was last modified on February 8, 2025 6:55 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…