స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా నిన్న జాక్ టీజర్ విడుదల చేశారు. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న ఈ యాక్షన్ కం కం కామెడీ ఎంటర్ టైనర్ కు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. కంటెంట్ పెద్దగా దాచకుండా స్టోరీ లైన్ చెప్పేశారు. ఇంట్లో చేస్తున్న ఉద్యోగం చెప్పకుండా బయట సరదాగా తిరిగే యువకుడి వెనుక పెద్ద యాక్షన్ సెటప్ ఉంటుంది.
అది ఏకంగా దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళతో ముడిపడినది కావడంతో కుర్రాడు ఫైట్లు చేస్తూ యుద్ధాలకు దిగుతాడు. వీటికి తోడు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. లైన్ ఆసక్తికరంగానే ఉంది. ఇక్కడ తనది సేఫ్ గేమ్ అనేందుకు కారణాలున్నాయి.
సిద్దు ఇప్పటిదాకా ప్రూవ్ చేసుకుంది టిల్లు బ్రాండ్ తోనే. రెండూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాయి. టిల్లు పాత్రలో ఉన్న కామెడీ టైమింగ్ సిద్దు జొన్నలగడ్డ ప్రదర్శించిన తీరు యూత్ ని బాగా దగ్గర చేసింది. రాధికా రాధికా అంటూ చేసిన అల్లరి ఓ రేంజ్ లో పేలింది. జాక్ విషయానికి వస్తే ఇది పూర్తి విభిన్నమైన పాయింట్ తో రూపొందింది.
అండర్ కవర్ కథల్లో సీరియస్ హీరోలను చూడటం ఎక్కువ కానీ ఇలా వినోదాత్మకంగా నవ్వించే ప్రయత్నం అరుదు. ఒకటి రెండు సినిమాల్లో తప్ప మిగిలినవి తనదైన ఫన్ టచ్ ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ ఈ సారి వేరే రూటు తీసుకున్నాడు. సో సిద్దుకిది సక్సెస్ కావడం చాలా కీలకం.
తర్వాత వచ్చే లైనప్ కూడా ఇదే తరహాలో ఉంది. తెలుసు కదా ఇద్దరు అమ్మాయిల ప్రేమతో ముడిపడిన కూల్ లవ్ స్టోరీ. ఎమోషన్లకు పెద్ద పీఠ వేస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న కోహినూర్ రెండు భాగాలుగా పీరియాడిక్ సెటప్ లో రూపొందిన భారీ ప్యాన్ ఇండియా మూవీ.
సో టిల్లు ఛాయలు, షేడ్స్ ఏవి సిద్దు నుంచి రాబోయే మూడు సినిమాల్లో ఉండవు. మార్కెట్ తో పాటు ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్న సిద్ధూ జొన్నలగడ్డ డిఫరెంట్ జానర్స్ టచ్ చేయడం అవసరం. దానికి అనుగుణంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. రిలీజుల మధ్య గ్యాప్ కూడా తక్కువే ఉండనుంది.
This post was last modified on February 8, 2025 9:05 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…