ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోవడం ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎలాగూ నిజమే కాబట్టి వీలైనంత త్వరగా కొత్త డేట్ ప్రకటించమని కోరుతున్నారు. అయితే నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పలు ఆప్షన్లను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా పోటీ లేని సోలో రిలీజ్ డేట్ అయితే బాలీవుడ్ మార్కెట్ ని సమాంతరంగా టార్గెట్ చేసినట్టవుతుందనే ఆలోచనలో దేవర, పుష్ప 2, కల్కి లాగా మంచి విడుదల తేదీని సెట్ చేసే చర్చల్లో తలమునకలైనట్టు సమాచారం.
వేసవిలో వచ్చే అవకాశాలు కూడా తక్కువే కనక దసరా వైపు చూస్తున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడో చిక్కుంది. సెప్టెంబర్ 25 బాలకృష్ణ అఖండ 2 తాండవం, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు రెండు ఒకే రోజు వస్తున్నాయి. విజయదశమి అక్కడికి కేవలం వారం దూరంలోనే ఉంటుంది.
ఒకవేళ వీటికి హిట్ టాక్ వస్తే ఆశించిన స్థాయిలో రాజా సాబ్ కు థియేటర్లు దక్కవు. ఇక్కడితో అయిపోలేదు. అక్టోబర్ 2 కాంతార చాప్టర్ 1 దిగుతుంది. దీని మీదున్న హైప్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ డేట్ మిస్ చేయకూడదనే లక్ష్యంతో దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి షూటింగ్ ఎక్కడా ఆపకుండా చేస్తున్నాడు.
సో ఒకవేళ ఈ ప్రతిబంధకాలు వద్దనుకుంటే ది రాజా దీపావళి లేదా ఇంకో ప్రత్యాన్మయం వైపు చూడాలి. దీపావళి సీజన్ అంతగా ఎక్కువ వర్కౌట్ అయ్యే సీజన్ కాదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాలి. అందులోనూ నార్త్ మార్కెట్ ప్రభాస్ కు చాలా కీలకం కాబట్టి హిందీ క్లాష్ లేకుండా చూసుకోవాలి.
ఆగస్ట్ లో ఛాన్స్ ఉన్నా వార్ 2 ఉన్న నేపథ్యంలో అంత పెద్ద మల్టీస్టారర్, పైగా యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణం. సో క్లాష్ అంత సేఫ్ కాదు. ఈ లెక్కలన్నీ చూసుకోబట్టే ది రాజా సాబ్ అనౌన్స్ మెంట్ ఆలస్యమవుతోంది. దర్శకుడు మారుతీ ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణకు తీసుకొచ్చారని తెలిసింది.
This post was last modified on February 6, 2025 2:31 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…