ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని అఫీషియల్ గా చెప్పకపోవడం ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎలాగూ నిజమే కాబట్టి వీలైనంత త్వరగా కొత్త డేట్ ప్రకటించమని కోరుతున్నారు. అయితే నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పలు ఆప్షన్లను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా పోటీ లేని సోలో రిలీజ్ డేట్ అయితే బాలీవుడ్ మార్కెట్ ని సమాంతరంగా టార్గెట్ చేసినట్టవుతుందనే ఆలోచనలో దేవర, పుష్ప 2, కల్కి లాగా మంచి విడుదల తేదీని సెట్ చేసే చర్చల్లో తలమునకలైనట్టు సమాచారం.
వేసవిలో వచ్చే అవకాశాలు కూడా తక్కువే కనక దసరా వైపు చూస్తున్నట్టు తెలిసింది. అయితే ఇక్కడో చిక్కుంది. సెప్టెంబర్ 25 బాలకృష్ణ అఖండ 2 తాండవం, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు రెండు ఒకే రోజు వస్తున్నాయి. విజయదశమి అక్కడికి కేవలం వారం దూరంలోనే ఉంటుంది.
ఒకవేళ వీటికి హిట్ టాక్ వస్తే ఆశించిన స్థాయిలో రాజా సాబ్ కు థియేటర్లు దక్కవు. ఇక్కడితో అయిపోలేదు. అక్టోబర్ 2 కాంతార చాప్టర్ 1 దిగుతుంది. దీని మీదున్న హైప్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ డేట్ మిస్ చేయకూడదనే లక్ష్యంతో దర్శకుడు కం హీరో రిషబ్ శెట్టి షూటింగ్ ఎక్కడా ఆపకుండా చేస్తున్నాడు.
సో ఒకవేళ ఈ ప్రతిబంధకాలు వద్దనుకుంటే ది రాజా దీపావళి లేదా ఇంకో ప్రత్యాన్మయం వైపు చూడాలి. దీపావళి సీజన్ అంతగా ఎక్కువ వర్కౌట్ అయ్యే సీజన్ కాదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేయాలి. అందులోనూ నార్త్ మార్కెట్ ప్రభాస్ కు చాలా కీలకం కాబట్టి హిందీ క్లాష్ లేకుండా చూసుకోవాలి.
ఆగస్ట్ లో ఛాన్స్ ఉన్నా వార్ 2 ఉన్న నేపథ్యంలో అంత పెద్ద మల్టీస్టారర్, పైగా యష్ రాజ్ ఫిలింస్ నిర్మాణం. సో క్లాష్ అంత సేఫ్ కాదు. ఈ లెక్కలన్నీ చూసుకోబట్టే ది రాజా సాబ్ అనౌన్స్ మెంట్ ఆలస్యమవుతోంది. దర్శకుడు మారుతీ ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణకు తీసుకొచ్చారని తెలిసింది.
This post was last modified on February 6, 2025 2:31 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…