ఇవాళ పట్టుదల (విడాముయార్చి) విడుదలయ్యింది. దీనికి ముందు నుంచి పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. హాలీవుడ్ ఇన్స్ పిరేషన్ తో తీయడం వల్ల మాస్ కి ఎక్కడం కష్టమే అనిపించింది. అందుకే తెలుగు వెర్షన్ లో సున్నా అంచనాలున్నాయి. కానీ తమిళంలో మాత్రం అజిత్ తన స్టార్ పవర్ ఎంత ఉందో మరో సారి నిరూపిస్తున్నాడు.
అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏకంగా తెగింపు, గోట్ లను టచ్ చేసే స్థాయిలో ఓపెనింగ్స్ ఫిగర్స్ నమోదు చేస్తున్నాడు. యుఎస్ ప్రీమియర్ల టాక్ మిశ్రమంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇది ఏ మేరకు హిట్ టాక్ తెచ్చుకుని నిలబడుతుందనేది చెప్పలేం.
ఇదంతా మైత్రికి పెద్ద జాక్ పాట్ లా మారబోతోంది. ఎందుకంటే అజిత్ నెక్స్ట్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలుగా దాని మీదున్న హైప్ కు ఆకాశమే హద్దుగా బిజినెస్ జరగడం ఖాయం. అసలే అజిత్ ని ఊర మాస్ అవతారంలో చూసి సంవత్సరాలు గడిచిపోయాయి. గ్యాంబ్లర్ తర్వాత అలాంటి లుక్ మళ్ళీ గుడ్ బ్యాడ్ అగ్లీలోనే చూపించబోతున్నారు.
అందులోనూ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ అజిత్ కు ప్రాణమిచ్చే వీరాభిమాని. సో ఎలా చూపిస్తాడో చెప్పనక్కర్లేదు. ఒకటి రెండు కాదు డిఫరెంట్ షేడ్స్ లో తలా విశ్వరూపం ఉంటుందని ఇప్పటికే చెన్నై మీడియా వర్గాల్లో బలమైన టాక్ ఉంది.
ఇంకా గుడ్ బ్యాడ్ అగ్లీకు సంబంధించిన ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. ఏప్రిల్ 10 విడుదల తేదీ మాత్రమే లాక్ చేశారు. వచ్చే నెల నుంచి పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం అంచనాలు పెంచుతున్నాయి.
కథకు సంబంధించిన క్లూస్ బయటికి రాలేదు కానీ అజిత్ మంచివాడు, చెడ్డవాడిగా డ్యూయల్ రోల్ చేశాడనే లీక్ అయితే చక్కర్లు కొడుతోంది. ముందస్తు అంచనా ప్రకారం ఈ సినిమా కనీసం వంద కోట్ల ఓపెనింగ్ తో మొదలువుతుందని కోలీవుడ్ ట్రేడ్ అంచనా. తెలుగులోనూ క్రేజ్ వచ్చేలా ప్రమోషన్లు ప్లాన్ చేయబోతున్నారని సమాచారం.
This post was last modified on February 6, 2025 10:39 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…