‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా.. మంగళవారం. 2023 నవంబరులో రిలీజైన ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. మలయాళం థ్రిల్లర్స్ చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో తీయరేంటి అనుకునేవాళ్లకు ఈ చిత్రం సమాధానంగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి ఫలితం రావాల్సింది కానీ.. ఓటీటీలో మాత్రం దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు గెలుచుకుందీ చిత్రం. ‘మంగళవారం’ తర్వాత అజయ్ వేరే సినిమా చేయాల్సింది కానీ.. అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడతను ‘మంగళవారం’ సీక్వెల్తోనే రాబోతున్నాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ పూర్తి కావస్తోంది. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఐతే ‘మంగళవారం-2’కు సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఇందులో లీడ్ రోల్ పాయల్ రాజ్పుత్ చేయట్లేదట.
అజయ్ తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ రోల్, తన పెర్ఫామెన్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ‘మంగళవారం’లో అంతకుమించిన పాత్ర ఆమెది. హార్మోన్ల సమస్య వల్ల కోరికలు అదుపు చేసుకోలేక ఇబ్బంది పడే పాత్రను చేయడానికి అందరు హీరోయిన్లూ ఒప్పుకోరు. పాయల్ ఆ పాత్రను ఎంతో కన్విన్సింగ్గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా చూశాక అందులో మరో హీరోయిన్ని ఊహించుకోలేం.
అంత బాగా ఆ పాత్రను పండించింది పాయల్. అలాంటి పెర్ఫామెన్స్ తర్వాత సీక్వెల్లో పాయల్ లేదంటే తన అభిమానులు ఒకింత నిరాశచెందుతారనడంలో సందేహం లేదు. కానీ ‘మంగళవారం’ కథలో ఆమె పాత్ర ముగిసిపోయింది కాబట్టి.. సీక్వెల్లో తనను కొనసాగించడానికి వీల్లేదు. పైగా వేరే హీరోయిన్ని పెట్టి కొత్త కథ చెప్పబోతున్న సంకేతాలు కూడా ఇవ్వాలి. అందుకే పాయల్కు ఈ సినిమాలో అవకాశం లేదని భావించాలి.
This post was last modified on February 5, 2025 1:25 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…