‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా.. మంగళవారం. 2023 నవంబరులో రిలీజైన ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. మలయాళం థ్రిల్లర్స్ చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో తీయరేంటి అనుకునేవాళ్లకు ఈ చిత్రం సమాధానంగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి ఫలితం రావాల్సింది కానీ.. ఓటీటీలో మాత్రం దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు గెలుచుకుందీ చిత్రం. ‘మంగళవారం’ తర్వాత అజయ్ వేరే సినిమా చేయాల్సింది కానీ.. అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడతను ‘మంగళవారం’ సీక్వెల్తోనే రాబోతున్నాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ పూర్తి కావస్తోంది. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఐతే ‘మంగళవారం-2’కు సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఇందులో లీడ్ రోల్ పాయల్ రాజ్పుత్ చేయట్లేదట.
అజయ్ తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ రోల్, తన పెర్ఫామెన్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ‘మంగళవారం’లో అంతకుమించిన పాత్ర ఆమెది. హార్మోన్ల సమస్య వల్ల కోరికలు అదుపు చేసుకోలేక ఇబ్బంది పడే పాత్రను చేయడానికి అందరు హీరోయిన్లూ ఒప్పుకోరు. పాయల్ ఆ పాత్రను ఎంతో కన్విన్సింగ్గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా చూశాక అందులో మరో హీరోయిన్ని ఊహించుకోలేం.
అంత బాగా ఆ పాత్రను పండించింది పాయల్. అలాంటి పెర్ఫామెన్స్ తర్వాత సీక్వెల్లో పాయల్ లేదంటే తన అభిమానులు ఒకింత నిరాశచెందుతారనడంలో సందేహం లేదు. కానీ ‘మంగళవారం’ కథలో ఆమె పాత్ర ముగిసిపోయింది కాబట్టి.. సీక్వెల్లో తనను కొనసాగించడానికి వీల్లేదు. పైగా వేరే హీరోయిన్ని పెట్టి కొత్త కథ చెప్పబోతున్న సంకేతాలు కూడా ఇవ్వాలి. అందుకే పాయల్కు ఈ సినిమాలో అవకాశం లేదని భావించాలి.
This post was last modified on February 5, 2025 1:25 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…