‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా.. మంగళవారం. 2023 నవంబరులో రిలీజైన ఈ సినిమా థ్రిల్లర్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. మలయాళం థ్రిల్లర్స్ చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో తీయరేంటి అనుకునేవాళ్లకు ఈ చిత్రం సమాధానంగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర ఇంకా మంచి ఫలితం రావాల్సింది కానీ.. ఓటీటీలో మాత్రం దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డులు గెలుచుకుందీ చిత్రం. ‘మంగళవారం’ తర్వాత అజయ్ వేరే సినిమా చేయాల్సింది కానీ.. అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడతను ‘మంగళవారం’ సీక్వెల్తోనే రాబోతున్నాడు. ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ పూర్తి కావస్తోంది. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఐతే ‘మంగళవారం-2’కు సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఇందులో లీడ్ రోల్ పాయల్ రాజ్పుత్ చేయట్లేదట.
అజయ్ తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ రోల్, తన పెర్ఫామెన్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. ‘మంగళవారం’లో అంతకుమించిన పాత్ర ఆమెది. హార్మోన్ల సమస్య వల్ల కోరికలు అదుపు చేసుకోలేక ఇబ్బంది పడే పాత్రను చేయడానికి అందరు హీరోయిన్లూ ఒప్పుకోరు. పాయల్ ఆ పాత్రను ఎంతో కన్విన్సింగ్గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా చూశాక అందులో మరో హీరోయిన్ని ఊహించుకోలేం.
అంత బాగా ఆ పాత్రను పండించింది పాయల్. అలాంటి పెర్ఫామెన్స్ తర్వాత సీక్వెల్లో పాయల్ లేదంటే తన అభిమానులు ఒకింత నిరాశచెందుతారనడంలో సందేహం లేదు. కానీ ‘మంగళవారం’ కథలో ఆమె పాత్ర ముగిసిపోయింది కాబట్టి.. సీక్వెల్లో తనను కొనసాగించడానికి వీల్లేదు. పైగా వేరే హీరోయిన్ని పెట్టి కొత్త కథ చెప్పబోతున్న సంకేతాలు కూడా ఇవ్వాలి. అందుకే పాయల్కు ఈ సినిమాలో అవకాశం లేదని భావించాలి.
This post was last modified on February 5, 2025 1:25 pm
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…
తిరుపతి నగరపాలక సంస్థలో మంగళవారం జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తి అయిపోయిన తర్వాత ఎందుకనో గానీ వైసీపీలో ఏడుపులు,…