అల్లు అర్జున్కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్ అయ్యాడు. స్టార్ ఇమేజ్ వచ్చాక లవ్ స్టోరీలు చేయడం కష్టమే. బన్నీ కూడా ఎక్కువగా మాస్, యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తూ సాగిపోయాడు. ఇప్పుడు అతనున్న స్థాయిలో ప్రేమకథను అస్సలు ఆశించలేం. కానీ బన్నీ మాత్రం పూర్తి స్థాయి ప్రేమకథ చేయాలనుకుంటున్నాడట. ఈ విషయమై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కు హామీ కూడా ఇచ్చాడట.
తాను సంగీతం అందించిన ‘తండేల్’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మీడియాను కలిసిన దేవి.. ఈ విషయం వెల్లడించాడు. ‘తండేల్’ మూవీకి దేవిని సంగీత దర్శకుడిగా పెట్టుకోమని టీంకు సూచించింది బన్నీనేనట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బన్నీకి ప్రేమకథలంటే ఎంతిష్టమో చెప్పిన దేవి.. ఆరు మెలోడీలతో ఒక లవ్ స్టోరీ చేద్దామని తనతో బన్నీ అన్న విషయాన్ని వెల్లడించాడు.
‘‘మిగతా జానర్లతో పోలిస్తే ప్రేమకథా చిత్రాలు ఎక్కువ కాలం నిలబడతాయి. దేవదాస్, గీతాంజలి, ఆర్య.. ఇలాంటి సినిమాలన్నీ అందరికీ గుర్తుండిపోవడానికి కారణమదే. ప్రేమ పాటలు కూడా ఎక్కువ కాలం నిలబడతాయి. అల్లు అర్జున్కు ఇప్పటికీ ఒక కోరిక ఉంది. ఆరుకు ఆరు ప్రేమ పాటలు ఉండే అందమైన లవ్ స్టోరీ ఒకటి చేయాలని. ఇదే విషయాన్ని ఈ మధ్య బన్నీ నాకొక పేపర్ మీద రాసి ఇచ్చాడు.
గుర్తు పెట్టుకో, మనం ఇలాంటి సినిమా ఒకటి చేద్దాం అని మ్యానిఫెస్టోలాగా సంతకం చేసి ఇచ్చాడు’’ అని దేవి వెల్లడించాడు. ఐతే ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న బన్నీ.. కెరీర్లో ఈ దశలో ఇక ప్రేమకథ చేయగలడా అన్నది సందేహం. ప్రభాస్ ఇలాగే ఇమేజ్ను పక్కన పెట్టి ‘రాధేశ్యామ్’ రూపంలో లవ్ స్టోరీ చేస్తే బెడిసికొట్టింది. మరి బన్నీ అలాంటి సాహసానికి పూనుకుంటాడా అన్నది ప్రశ్న. ప్రస్తుతం అతను త్రివిక్రమ్ సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 5, 2025 3:56 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…