అల్లు అర్జున్కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్ అయ్యాడు. స్టార్ ఇమేజ్ వచ్చాక లవ్ స్టోరీలు చేయడం కష్టమే. బన్నీ కూడా ఎక్కువగా మాస్, యాక్షన్ సినిమాలే ఎక్కువగా చేస్తూ సాగిపోయాడు. ఇప్పుడు అతనున్న స్థాయిలో ప్రేమకథను అస్సలు ఆశించలేం. కానీ బన్నీ మాత్రం పూర్తి స్థాయి ప్రేమకథ చేయాలనుకుంటున్నాడట. ఈ విషయమై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్కు హామీ కూడా ఇచ్చాడట.
తాను సంగీతం అందించిన ‘తండేల్’ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మీడియాను కలిసిన దేవి.. ఈ విషయం వెల్లడించాడు. ‘తండేల్’ మూవీకి దేవిని సంగీత దర్శకుడిగా పెట్టుకోమని టీంకు సూచించింది బన్నీనేనట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బన్నీకి ప్రేమకథలంటే ఎంతిష్టమో చెప్పిన దేవి.. ఆరు మెలోడీలతో ఒక లవ్ స్టోరీ చేద్దామని తనతో బన్నీ అన్న విషయాన్ని వెల్లడించాడు.
‘‘మిగతా జానర్లతో పోలిస్తే ప్రేమకథా చిత్రాలు ఎక్కువ కాలం నిలబడతాయి. దేవదాస్, గీతాంజలి, ఆర్య.. ఇలాంటి సినిమాలన్నీ అందరికీ గుర్తుండిపోవడానికి కారణమదే. ప్రేమ పాటలు కూడా ఎక్కువ కాలం నిలబడతాయి. అల్లు అర్జున్కు ఇప్పటికీ ఒక కోరిక ఉంది. ఆరుకు ఆరు ప్రేమ పాటలు ఉండే అందమైన లవ్ స్టోరీ ఒకటి చేయాలని. ఇదే విషయాన్ని ఈ మధ్య బన్నీ నాకొక పేపర్ మీద రాసి ఇచ్చాడు.
గుర్తు పెట్టుకో, మనం ఇలాంటి సినిమా ఒకటి చేద్దాం అని మ్యానిఫెస్టోలాగా సంతకం చేసి ఇచ్చాడు’’ అని దేవి వెల్లడించాడు. ఐతే ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న బన్నీ.. కెరీర్లో ఈ దశలో ఇక ప్రేమకథ చేయగలడా అన్నది సందేహం. ప్రభాస్ ఇలాగే ఇమేజ్ను పక్కన పెట్టి ‘రాధేశ్యామ్’ రూపంలో లవ్ స్టోరీ చేస్తే బెడిసికొట్టింది. మరి బన్నీ అలాంటి సాహసానికి పూనుకుంటాడా అన్నది ప్రశ్న. ప్రస్తుతం అతను త్రివిక్రమ్ సినిమాకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 5, 2025 3:56 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…