అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్టు ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఒకరితో అనుకున్నది మరొకరితో తెరకెక్కించి ఆశించిన ఫలితం అందుకోనప్పుడు ఆ దర్శకులు పడే బాధ వర్ణనాతీతం. వాళ్ళు చెబితే తప్ప ఇవి బయట ప్రపంచానికి తెలియవు. కృష్ణవంశీ అలాంటిదే ఒకటి పంచుకున్నారు.
గత కొంత కాలంగా ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉన్న ఆయన్ను ఒక అభిమాని శ్రీ ఆంజనేయంని ముందు జూనియర్ ఎన్టీఆర్ తో అనుకున్నారాని అడిగాడు. దానికాయన కాదని సమాధానం చెబుతూ కథ రాసుకున్నది చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని అని, కానీ నా దురదృష్టం వల్ల జరగలేదని అన్నారు.
ఇంకొంచెం లోతైన వివరాల్లోకి వెళదాం. 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయంని చిరంజీవితో కనక కృష్ణవంశీ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. యాక్షన్ కింగ్ అర్జున్ పోషించిన అంజనీ పుత్రుడు పాత్రకు బెస్ట్ ఛాయస్ కావడంతో పాటు సినిమా రేంజ్ కి చాలా ఉపయోగపడేది.
కానీ అప్పటికే నాలుగేళ్ల క్రితం 2001లో శ్రీ మంజునాథతో చిరు మిశ్రమ ఫలితం అందుకోవడంతో మరోసారి దేవుడిగా కనిపించేందుకు ఇష్టపడలేదు. అందులోనూ తన ఆరాధ్య దైవం. పైగా స్క్రిప్ట్ లో ప్రేమకథ పేరుతో కృష్ణవంశీ ఘాటైన రొమాన్స్ రాశాడు. ముఖ్యంగా ఛార్మీని చూపించిన విధానం మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సో వదులుకోవడం ఒకరకంగా మంచిదే అయ్యింది. ఇది కాకుండా కృష్ణవంశీ వందేమాతరం పేరుతో మరో ప్యాన్ ఇండియా మూవీని మెగాస్టార్ తో తీయాలని బలంగా ప్రయత్నించారు. బడ్జెట్ చాలా ఎక్కువగా డిమాండ్ చేయడంతో పాటు అప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రీడమ్ ఫైట్ నేపధ్యాలు కమర్షియల్ గా వర్కౌట్ కావని భావించి ఏ నిర్మాతా ముందుకు రాలేదు.
అది కాస్తా కథ స్టేజి దగ్గరే ఆగిపోయింది. ఇలా రెండుసార్లు ఛాన్స్ మిస్ చేసుకున్న కృష్ణవంశీ తర్వాత చిరు వారసుడు రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే చేశారు కానీ దాని ఫలితం నిరాశపరచడం ఊహించని మలుపు. కొన్ని కథలంతే. కంచికి చేరవు.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…