ఒక సమయంలో ఒక ప్యాన్ ఇండియా మూవీని నిర్మించడానికే నిర్మాతలు కిందా మీదా పడుతున్న రోజులివి. ఏ మాత్రం ఆలస్యం జరిగినా లేదా పరిస్థితులు అనుకూలించకపోయినా బడ్జెట్ అంతకంతా పెరిగిపోయి క్లిష్టమైన పరిస్థితులు ఎదురుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ రూపంలో దిల్ రాజుకిది అనుభవమే.
అలాంటిది ఏకాకాలంలో రెండు టాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రాలను తెరకెక్కిస్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. కానీ మైత్రి మూవీ మేకర్స్ దాన్ని తట్టుకుని మరీ ప్రాజెక్టులు తెరకెక్కిస్తోంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఫౌజీ కీలక దశకు చేరుకుంది.
రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. స్వాతంత్రం రాకముందు నేపధ్యాన్ని అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ల రూపంలో సృష్టించి చిత్రీకరణ చేస్తున్నారు. ఇంతకు ముందు భాగాలు ఇక్కడే షూట్ చేశారు. సైనికుడిగా ప్రభాస్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని, ఎమోషనల్ ప్రేమకథతో బాట దేశభక్తి అంశాలు మెండుగా ఉంటాయట.
ఇక జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందే సినిమాని ఇదే నెలలలో షురూ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత తారక్ లేని ఎపిసోడ్లను షూట్ చేస్తారని వినికిడి. కెజిఎఫ్, సలార్ ని మించిన సరికొత్త ప్రపంచాన్ని నీల్ సృష్టించాడని టాక్.
సో విడుదల తేదీలు ఇంకా నిర్ధారణ కాకపోయినా ఈ రెండు సినిమాలు ఏడాది లోపే వచ్చేలా దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎంత వరకు సాధ్యమవుతోందో ఖచ్చితంగా చెప్పలేం కానీ ప్లానింగ్ అయితే దానికి అనుగుణంగా చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ నీల్ 2026 సంక్రాంతి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫౌజీని వచ్చే ఏడాది వేసవికి టార్గెట్ అంటున్నారు.
ఇవి కాకుండా రాబిన్ హుడ్ విడుదల, ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాలన్స్ షూట్, గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్ రిలీజ్ లాంటి బోలెడు పనులు మైత్రి ముందున్నాయి. పుష్ప 2 ది రూల్ ఇచ్చిన ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఆనందం ఈ బ్యానర్ కి నింపిన జోష్ అంతా ఇంతా కాదు.
This post was last modified on February 4, 2025 3:34 pm
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…