గేమ్ ఛేంజర్ ఫలితం గురించి మాట్లాడేందుకు ఏం లేదు కానీ అప్పుడప్పుడు వద్దన్నా దాని తాలూకు కంటెంట్ అభిమానులను గుచ్చుతూనే ఉంటుంది. నిన్న నానా హైరానా వీడియో సాంగ్ ని యూట్యూబ్ లో అఫీషియల్ గా రిలీజ్ చేశారు. జనవరి 10 సినిమా రిలీజైన మొదటి రోజు ఈ సాంగ్ లేకపోవడం ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది.
విడుదలకు ముందు దర్శకుడు శంకర్, తమన్ ఇద్దరూ దీని గురించి ఒక ఇంటర్వ్యూ వీడియో చేశారు. సాంగ్ మేకింగ్ అంటూ గాయనీ గాయకులతో కలిసి ఒక టీజర్ వదిలారు. ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడినట్టు గొప్పగా చెప్పుకున్నారు.
తీరా చూస్తే థియేటర్లలో లేదు. మూడు రోజుల తర్వాత జోడించారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయిపోయింది. నెగటివ్ టాక్ విపరీతంగా పాకిపోవడంతో జనం పట్టించుకోలేదు. పాట బాగుందనే టాక్ ఉన్నా దాని ప్రభావం ఇనుమంతైనా కలెక్షన్ల మీద పడలేదు. కట్ చేస్తే నిన్న యూట్యూబ్ లో చూసిన ప్రతి ఒక్కరు ఇంత మంచి విజువల్స్ ని అనవసరంగా వృథా చేసుకున్నారనే కామెంట్స్ తో శంకర్ ని నిందిస్తున్నారు.
ఒకవేళ ప్లేస్ మెంట్ లేక ఎడిటింగ్ లో తీసేశారు అనుకుంటే అసలు స్క్రిప్ట్ లోనే గుర్తించాల్సింది కదాని నిలదీస్తున్నారు. దేవర దావూదీ రూట్ లో వెళ్లడం మిస్ ఫైర్ అయ్యిందని విమర్శిస్తున్నారు.
సరే జరిగిందేదో జరిగింది కానీ తక్కువ బడ్జెట్ లో ఇలాంటి పాట తీసే లేపేస్తే ఇబ్బంది ఉండదు కానీ ఇలా ఇంత గ్రాండ్ స్కేల్ లో షూట్ చేశాక తెరమీద కనిపించకపోతే పని చేసిన ప్రతి ఒక్కరికి బాధే. అన్నట్టు అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్ అతి త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఇవాళో రేపో ప్రకటన ఇవ్వబోతున్నారు.
భారీ మొత్తానికి హక్కులు సొంతం చేసుకున్న ప్రైమ్ బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా ఓటిటిలో మాత్రం భారీ వ్యూస్ తెచ్చుకుంటుందనే ఆశాభావంతో ఉంది. అయితే హెచ్డి లీక్ తో ఆల్రెడీ తీవ్రంగా నష్టపోయిన గేమ్ ఛేంజర్ డిజిటల్ లో ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. వచ్చే వారం రిలీజని టాక్.
This post was last modified on February 4, 2025 10:58 am
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…