తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ వెళ్లి హిందీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత కూడా పూరి జగన్నాథ్ లాంటి కొందరు డైరెక్టర్లు అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో సందీప్ రెడ్డి వేసిన ఇంపాక్ట్ గురించి తెలిసిందే.
ఇక త్వరలోనే గోపీచంద్ మలినేని తొలి హిందీ చిత్రం విడుదల కాబోతోంది. సీనియర్ హీరోగా సన్నీ డియోల్ లీడ్ రోల్లో ఆయన రూపొందించిన ‘జాట్’ ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నిర్మిస్తున్నది టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్సే కావడం విశేషం. ఆ సంస్థలోనే గోపీచంద్ ‘వీరసింహారెడ్డి’ తీశాడు. తర్వాత అతడికి బాలీవుడ్ ప్రాజెక్ట్ సెట్ చేసింది మైత్రీ సంస్థ. ఇప్పుడు మైత్రీ సంస్థ మరో దర్శకుడిని బాలీవుడ్కు తీసుకెళ్లే పనిలో ఉన్నట్లు సమాచారం.
గోపీతో ‘వీరసింహారెడ్డి’ చేస్తున్నపుడే.. బాబీ కొల్లితో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది మైత్రీ సంస్థ. రెండు చిత్రాలూ మంచి ఫలితాలందుకున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ.. ‘డాకు మహారాజ్’ చేశాడు. అదీ సక్సెస్ అయింది. ఇప్పుడు బాబీని హిందీకి తీసుకెళ్లే ప్రయత్నంలో మైత్రీ సంస్థ ఉందట. అతడితో ఇందుకోసం ఒక స్క్రిప్టు రెడీ చేయిస్తోందట.
ఆ పని పూర్తయ్యాక ఆ కథకు తగ్గ హీరోతో బాలీవుడ్లో మరో భారీ చిత్రం చేయాలని మైత్రీ సంస్థ చూస్తోంది. బాబీకి వెంటనే తెలుగులో అయితే ఏ కమిట్మెంట్ లేదని తెలుస్తోంది. ఉన్నా.. దాన్ని వాయిదా వేయించి హిందీ సినిమానే చేయించబోతోందట మైత్రీ సంస్థ. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ రిలీజ్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకున్న బాబీ.. ప్రస్తుతం తన రైటింగ్ టీంతో కలిసి స్క్రిప్టు పనిలో ఉన్నట్లు సమాచారం.
This post was last modified on February 3, 2025 4:40 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…