తమిళంలో చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది ఐశ్వర్యా రాజేష్. కెరీర్ ఆరంభంలోనే ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా డీగ్లామరస్ రోల్ చేసింది ‘కాకా ముట్టై’లో. ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత కూడా ఇలాంటి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్సే చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోందామె.
ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘కనా’ సూపర్ హిట్టయింది తమిళంలో. దీన్నే తెలుగులో ‘కౌసల్యా కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్ చేశారు. కానీ అదిక్కడ ఏమాత్రం ఆడలేదు. ఇదే కాక ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఓ కీలక పాత్ర చేసింది ఐశ్వర్య. ఆమె వరకు అదరగొట్టినా ఈ సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో ఐశ్వర్యకు మాతృభాషలో కెరీర్ ముందుకు సాగలేదు. అయినప్పటికీ ఆమె పోరాటం ఆపట్లేదు.
ఐశ్వర్య తమిళంలో నటిస్తున్న కొత్త చిత్రాన్ని తెలుగులో కూడా ఒకేసారి రూపొందిస్తున్నారు. ఆ సినిమా పేరు.. భూమిక. ఇది ఐశ్వర్యకు ల్యాండ్ మార్క్ ఫిలిం కావడం విశేషం. ఇది ఆమె 25వ సినిమా. రతీంద్రన్ ప్రసాద్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ లాంటి టాప్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ను కూడా లాంచ్ చేశారు. దట్టమైన అడవిలో పచ్చని చెట్ల నుంచే పుట్టుకొచ్చిన రూపంతో ఐశ్వర్య రూపం ఆసక్తి రేకెత్తిస్తోంది.
తమిళంలో మనమ్మాయిని నమ్మి ఇలా వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మిస్తున్నారంటే గొప్ప విషయమే. ఇంతకుముందు అంజలికి ఇలాంటి ఇమేజ్ వచ్చిందక్కడ. స్వాతి, శ్రీ దివ్య, ఆనంది లాంటి తెలుగమ్మాయిలు అక్కడ సత్తా చాటారు. ఇప్పుడు రీతూ వర్మ కూడా మంచి పేరు సంపాదిస్తోంది. ఐతే నటిగా ఐశ్వర్యకు వచ్చిన పేరు మాత్రం ఇంకెవరికీ రాలేదనే చెప్పాలి. మరి ఈ సినిమాతో కోలీవుడ్లో ఐశ్వర్య ఎలాంటి ముద్ర వేస్తుందో.. తెలుగులో ఏమేర ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 8:41 am
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…