అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో… ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది బాలీవుడ్ భామ పూజా హెగ్డే. పెద్ద సినిమాల్లో కథానాయికగా ఆమె ఫస్ట్ ఛాయిస్గా కనిపించేది. కానీ ఉన్నట్లుండి ఆమె కెరీర్లో డౌన్ ఫాల్ మొదలైంది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య.. ఇలా వరుసగా ఫెయిల్యూర్లు పలకరించాయి.
సక్సెస్లో ఉన్నపుడు ఇండస్ట్రీ జనాలు ఎలా నెత్తిన పెట్టుకుంటారో.. వరుసగా ఫెయిల్యూర్లు ఎదురైతే అంత లైట్ తీసుకుంటారు. ఓవైపు ఫ్లాపులు.. మరోవైపు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి వైదొలగడం పూజాకు ప్రతికూలంగా మారాయి. ఉన్నట్లుండి ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. వేరే భాషల్లో అవకాశాలు వస్తున్నా.. అక్కడ కూడా ఫెయిల్యూర్లు ఆగట్లేదు. బాలీవుడ్లో ఆమె నటించిన సర్కస్, కిసీ కా భాయ్ కిసి కి జాన్ కూడా డిజాస్టర్లే అయ్యాయి.
ఇప్పుడు ఆమె ఆశలన్నీ మరో హిందీ చిత్రం ‘దేవా’ మీద నిలిచాయి. షాహిద్ కపూర్ సరసన మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో పూజా నటించిన సినిమా ఇది. గత వీకెండ్లో మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తెలుగులో ‘హంట్’గా రీమేక్ అయిన పుష్కర కాలం నాటి మలయాళ చిత్రం ‘ముంబయి పోలీస్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకతో పోలిస్తే చాలా మార్పులు చేసినా ఫలితం లేకపోయింది.
సినిమాకు సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. వీకెండ్లోనే సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. సోమవారం నుంచి వసూళ్లను పెద్దగా కన్సిడర్ చేసే పరిస్థితి కూడా ఉండేలా లేదు. దీంతో పూజ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయినట్లే అని తేలిపోయింది. వరుసగా ఇన్ని ఫెయిల్యూర్లు వస్తే ఏ హీరోయిన్కైనా కష్టమే. ప్రస్తుతం ఆమె తమిళంలో రెట్రో, జననాయగన్ సినిమాల్లో నటిస్తోంది. మరి ఆ చిత్రాలైనా తన రాతను మారుస్తాయేమో చూడాలి.
This post was last modified on February 3, 2025 1:56 pm
నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…
శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయన అనుకూల…
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…