తమిళనాట సినిమాలతో పాటు సినిమాయేతర విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే అమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్. సీనియర్ నటుడు శరత్ కుమార్ తనయురాలైన ఈ భామ.. మొదట్లో కథానాయికగా నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఆ సమయంలోనే విశాల్తో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా ఈమె వార్తల్లో నిలిచింది.
వివాదాస్పద అంశాలపై చాలా బోల్డ్గా మాట్లాడే అలవాటున్న వరలక్ష్మి ఒక సమయంలో విశాల్తో సన్నిహితంగానే మెలిగింది. అతడిని పెళ్లాడబోతున్నట్లే కనిపించింది. కానీ తర్వాత అతడికి దూరమైంది. సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. కథానాయిక పాత్రలు కలిసి రాకపోవడంతో ఆమె విలన్, క్యారెక్టర్ రోల్స్ వైపు మళ్లింది. అవి బాగానే వర్కవుటయ్యాయి. విజయ్ నటించిన సర్కార్ లాంటి భారీ చిత్రంలో ఆమె విలన్ పాత్ర పోషించడం విశేషం.
తెలుగులో కూడా తెనాలి రామకృష్ణ సహా కొన్ని సినిమాల్లో నటించిన వరలక్ష్మి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. ఆమె దర్శకురాలిగా మారింది. కన్నామూచ్చి (దాగుడుమూతలు అని అర్థం) అనే టైటిల్తో వరలక్ష్మి దర్శకురాలిగా అరంగేట్రం చేయనుంది. ఈ సినిమా ప్రి లుక్ పోస్టర్ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. పోస్టర్ చూస్తే ఇదో థ్రిల్లర్ తరహా సినిమా అనిపిస్తోంది. ఈ చిత్ర ప్రి లుక్ పోస్టర్ను మన మంచు లక్ష్మీప్రసన్న లాంచ్ చేయడం విశేషం.
తమిళంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ అయిన తెండ్రాల్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించనుంది. సామ్ సీఎస్ సంగీతం సమకూర్చనున్నాడు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్న నటీనటులెవరన్నది వెల్లడి కాలేదు. వరలక్ష్మి ఇలా దర్శకురాలిగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మరి కొత్త అవతారంలో ఆమె ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
This post was last modified on October 20, 2020 8:32 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…