ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు ముందు గ్రామ్ ఫోన్ రికార్డులు వాడేవాళ్లు. థియేటర్లో మళ్ళీ మళ్ళీ సినిమాలు చూసే అవకాశం లేని వాళ్ళు కనీసం డైలాగులైనా విందామనే ఉద్దేశంతో కేవలం సంభాషణలు మాత్రమే ఉండే క్యాసెట్లను కొనేవాళ్ళు.
వీటిలో పాటలు ఉండవు. దానవీరశూరకర్ణ, షోలే, అడవిరాముడు లాంటివి వీటి అమ్మకాల్లో రికార్డులు సృష్టించేవి. 2000 సంవత్సరం ఆపై మూడు నాలుగేళ్ల దాకా ఇవి వస్తూనే ఉన్నాయి. తర్వాత టెక్నాలజీ పెరిగాక ఇవి ఆగిపోయాయి. ఎంపి3 హవా కొంత కాలం నడిచింది.
ఇప్పుడు యూట్యూబ్, స్పాటిఫై, జియో సవాన్, యాపిల్ ట్యూన్స్ తదితరాల ప్రపంచం. అంతా డిజిటలే. ఓటిటిలు వచ్చాక ఏ సినిమా అయినా నేరుగా ఎన్నిసార్లయినా చూసే వెసులుబాటు రావడంతో క్రమంగా డైలాగులను ఆడియో రూపంలో ఇచ్చే ట్రెండ్ కనుమరుగైపోయింది.
ఓన్లీ సాంగ్స్ ధోరణికి ఆడియన్స్ అలవాటు పడ్డారు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ దాన్ని మార్చే పనిలో పడింది. పాటలు లేకుండా ముఖ్యమైన ఎపిసోడ్స్ కు సంబంధించిన డైలాగులను జూక్ బాక్స్ పేరుతో ఆడియో మాత్రమే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అంటే కేవలం వినగలం తప్ప చూడలేం.
ఇది కనక వర్కౌట్ అయితే మరిన్ని సినిమాలు ఇదే దారిలో వెళ్తాయి. కాకపోతే కంటెంట్ లో మళ్ళీ వినాలనిపించే స్థాయిలో మాటలు ఉండాలి. అప్పుడే ఆదరణ దక్కుతుంది. పుష్ప 2లో ఇవి బోలెడు. రావు రమేష్ ని అల్లు అర్జున్ సిఎం అయిపోమని చెప్పడం, భర్త గొప్పదనం గురించి శ్రీవల్లి వివరించే సన్నివేశం, దుబాయ్ సేటుతో పుష్పరాజ్ చేసే ఎర్ర చందనం డీల్ లాంటివి జస్ట్ వినేందుకు కూడా బాగుంటాయి.
అయినా రిలీజైన రెండు నెలల తర్వాత కూడా ఏదో ఒక రూపంలో పుష్ప 2 సౌండ్ చేస్తూనే ఉంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసిన బన్నీ బ్లాక్ బస్టర్ అందులో కూడా రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…