ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు ముందు గ్రామ్ ఫోన్ రికార్డులు వాడేవాళ్లు. థియేటర్లో మళ్ళీ మళ్ళీ సినిమాలు చూసే అవకాశం లేని వాళ్ళు కనీసం డైలాగులైనా విందామనే ఉద్దేశంతో కేవలం సంభాషణలు మాత్రమే ఉండే క్యాసెట్లను కొనేవాళ్ళు.
వీటిలో పాటలు ఉండవు. దానవీరశూరకర్ణ, షోలే, అడవిరాముడు లాంటివి వీటి అమ్మకాల్లో రికార్డులు సృష్టించేవి. 2000 సంవత్సరం ఆపై మూడు నాలుగేళ్ల దాకా ఇవి వస్తూనే ఉన్నాయి. తర్వాత టెక్నాలజీ పెరిగాక ఇవి ఆగిపోయాయి. ఎంపి3 హవా కొంత కాలం నడిచింది.
ఇప్పుడు యూట్యూబ్, స్పాటిఫై, జియో సవాన్, యాపిల్ ట్యూన్స్ తదితరాల ప్రపంచం. అంతా డిజిటలే. ఓటిటిలు వచ్చాక ఏ సినిమా అయినా నేరుగా ఎన్నిసార్లయినా చూసే వెసులుబాటు రావడంతో క్రమంగా డైలాగులను ఆడియో రూపంలో ఇచ్చే ట్రెండ్ కనుమరుగైపోయింది.
ఓన్లీ సాంగ్స్ ధోరణికి ఆడియన్స్ అలవాటు పడ్డారు. ఇప్పుడు పుష్ప 2 ది రూల్ దాన్ని మార్చే పనిలో పడింది. పాటలు లేకుండా ముఖ్యమైన ఎపిసోడ్స్ కు సంబంధించిన డైలాగులను జూక్ బాక్స్ పేరుతో ఆడియో మాత్రమే యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అంటే కేవలం వినగలం తప్ప చూడలేం.
ఇది కనక వర్కౌట్ అయితే మరిన్ని సినిమాలు ఇదే దారిలో వెళ్తాయి. కాకపోతే కంటెంట్ లో మళ్ళీ వినాలనిపించే స్థాయిలో మాటలు ఉండాలి. అప్పుడే ఆదరణ దక్కుతుంది. పుష్ప 2లో ఇవి బోలెడు. రావు రమేష్ ని అల్లు అర్జున్ సిఎం అయిపోమని చెప్పడం, భర్త గొప్పదనం గురించి శ్రీవల్లి వివరించే సన్నివేశం, దుబాయ్ సేటుతో పుష్పరాజ్ చేసే ఎర్ర చందనం డీల్ లాంటివి జస్ట్ వినేందుకు కూడా బాగుంటాయి.
అయినా రిలీజైన రెండు నెలల తర్వాత కూడా ఏదో ఒక రూపంలో పుష్ప 2 సౌండ్ చేస్తూనే ఉంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చేసిన బన్నీ బ్లాక్ బస్టర్ అందులో కూడా రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.
This post was last modified on February 2, 2025 3:47 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…