యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడు కావడం ఆలస్యం.. చదువు, వృత్తి కోసం తమ దేశానికి వచ్చే విదేశీయుల విషయంలో కఠిన నిబంధనలు, సంస్కరణల దిశగా అడుగులు వేశారు. యుఎస్లో పుట్టే విదేశీయుల పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా ఆయన ప్రతిపాదించిన చట్టానికి కోర్టులో తాత్కాలికంగా బ్రేక్ పడినా.. దాన్ని ఎలాగైనా అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నాడు ట్రంప్. మరోవైపు చదువు కోసం వచ్చి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునే విదేశీయుల పట్ల ట్రంప్ సర్కారు ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది.
పెద్ద ఎత్తున రైడ్స్ జరుగుతున్నాయి. అక్రమంగా పని చేస్తున్న వాళ్లను వాళ్ల వాళ్ల దేశాలకు పంపించేస్తున్నారు. వాళ్లతో పని చేయించుకుంటున్న వాళ్లపై ఫైన్స్ వేస్తున్నారు. ఈ పరిణామం యుఎస్లో చదువు కోసం వెళ్లిన లక్షలమంది భారతీయుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. ఇన్నాళ్లూ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉన్న భారత యువత.. ఇప్పుడు తమ ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ట్రంప్ సర్కారు ఇదే కఠిన వైఖరి అవలంభిస్తే ఇండియన్ యూత్కు తీవ్ర ఇబ్బందులు తప్పవు.
డబ్బులకు కటకటలాడాల్సిందే. ఈ ప్రభావం తెలుగు వాళ్లు నిర్వహించే వ్యాపారాల మీదే కాక తెలుగు సినిమాల మీద కూడా గట్టిగానే పడుతుందని అంచనా. ఇకపై ఎంత రేటుపెట్టినా ప్రిమియర్ షోల టికెట్లను ఎగబడి కొనే పరిస్థితి ఉండదు. మొత్తంగా తెలుగు సినిమాల ఆక్యుపెన్సీలు పడిపోతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలను కొనే విషయంలో డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
రేట్ల విషయంలో ముందు వెనక ఆలోచిస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల్లో రానున్న సినిమాలకు వచ్చే స్పందనను బట్టి తర్వాతి చిత్రాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రాబోయే రోజుల్లో వసూళ్లు తగ్గితే.. బిజినెస్ మీద కచ్చితంగా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఏదైనా ట్రంప్ సర్కారు వైఖరి మున్ముందు ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారింది.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…