Manchu Laxmi
మంచు లక్ష్మీ ప్రసన్న తెలుగు యాస గురించి ఇప్పటిదాకా ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో అందరికీ తెలుసు. దీన్ని లక్ష్మితో పాటు మంచు కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకుని స్పోర్టివ్గా తీసుకోవడం మొదలుపెట్టారు. తన వాయిస్ను ఇమిటేట్ చేస్తూ పెట్టే స్పూఫ్ వీడియోల్ని మంచు లక్ష్మినే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
ఇంత స్పోర్టివ్గా ఉండే మంచు లక్ష్మికి తాజాగా ఓ నెటిజన్ కోపం తెప్పించాడు. తన భాష విషయంలో లోపాన్ని ఎత్తి చూపించినందుకు ఆమె కోపం తెచ్చుకుంది. బుధవారం ఉదయం మంచు లక్ష్మి రెండు జడలు వేసుకుని మల్లెపూలు పెట్టుకుని తీయించుకున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. అందులో లక్ష్మి తల్లి నిర్మలా దేవి కూడా ఉంది. దీనికి.. Amma, maali puvulu petindhi. Flowers from our garden! అని వ్యాఖ్య జోడించింది లక్ష్మి.
ఐతే ఈ మెసేజ్లో మల్లి స్పెలింగ్ తప్పుగా ఉండటంతో ఓ నెటిజన్ దాన్ని సరి చేసే ప్రయత్నం చేశాడు. అది maali కాదు malli అని ఆమెకు కొంచెం సెటైరిగ్గా చెప్పాడు. దీంతో లక్ష్మికి కోపం వచ్చింది. పోబే అంటూ అతణ్ని తిట్టింది. దీనికతను పోవే అంటూ రిప్లై ఇచ్చాడు. ఐతే ఈ కాన్వర్జేషన్ జరిగింది ఉదయం కాగా.. రాత్రికి లక్ష్మి కొంచెం శాంతించింది.
మల్లెపువ్వుల ఫొటో షేర్ చేసిన లక్ష్మీ ప్రసన్న.. మల్లెపువ్వుకు రకరకాల స్పెల్లింగ్స్ ఉన్నాయని.. అయినా తాను పెట్టిన ఫొటోలు ఆస్వాదించకుండా స్పెల్లింగ్స్ గురించి డిస్కషన్ ఏంటని ప్రశ్నించింది. తాను స్కూల్లో లాంగ్వేజ్ సరిగా చదువుకోలేదని.. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి తన టింగ్లిష్ లేదా ఇంగ్లిష్ ఏమాత్రం కారణం కాదని నమ్ముతానని ఆమె వ్యాఖ్యానించింది. ఇలా ఈ మల్లెపువ్వు గొడవకు తెరదించింది మంచువారి అమ్మాయి.
This post was last modified on April 29, 2020 3:37 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…