ఇటీవలి కాలంలో సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ ఏదైనా ఉందంటే ముందుగా చెప్పుకోవాల్సింది మార్కోనే. నిన్నటి దాక టయర్ 2, 3 విభాగంలో ఊగుతున్న హీరో ఉన్ని ముకుందన్ ని ఒక్కసారిగా స్టార్ గా మార్చిన ఘనత దీనికే దక్కుతుంది. విపరీతమైన హింస ఉన్నప్పటికీ ప్రేక్షకులు మార్కోని ఆదరించిన తీరు విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ మలయాళం, హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా బాలీవుడ్ వెర్షన్ మొదటి రోజు కేవలం లక్ష రూపాయలతో మొదలై జనవరి 1న కోటి రూపాయలు దాకా వసూలు చేయడం చిన్న విషయం కాదు. ఇదంతా జరిగి నెల దాటేసింది.
కానీ మార్కో పరిణామాలు వేరే కోణంలో కూడా ఉన్నాయి. మచ్చుకు ఒకటి చూద్దాం. ముంబై గ్రాండ్ రోడ్ లో ఉన్న నిశాంత్ థియేటర్ లో మార్కో రిలీజయ్యింది . దాని యజమాని పహ్లాజ్ నిహలాని. ఈయన ఒకప్పటి సెన్సార్ బోర్డు సభ్యుడు. సాధారణంగా ఈ హాలుకు మాస్ జనాలు ఎక్కువగా వస్తారు.
మొన్నెప్పుడో మార్కో వేసుకున్నారు. ఇందులో ఉన్న భీభత్సమైన వయొలెన్స్ కి జడుసుకున్న ప్రేక్షకులు ఇలాంటివి ఎందుకు ప్రదర్శిస్తున్నారని మేనేజర్ ని నిలదీశారు. అంతే కాదు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మర్డర్ సీన్లకు గట్టిగా కేకలు పెడుతున్న వైనం గమనించి వెంటనే మార్కోని ఆ థియేటర్ నుంచి తీసేశారు.
ఇదంతా పహ్లాజ్ నిహ్లానీ స్వయంగా చెప్పుకొచ్చారు. చిన్నపిల్లలు జడుసుకునే ఇలాంటి కంటెంట్ కి ఏ సర్టిఫికెట్ ఇచ్చేసి చేతులు దులుపుకోవడం సరికాదని, యానిమల్ బ్లాక్ బస్టర్ కావడంలో హింసతో పాటు క్యాస్టింట్, హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ దోహదం చేశాయని, దాని స్ఫూర్తితో మార్కో లాంటివి రావడాన్ని ఆయన ఆక్షేపించారు.
అయినా ఆడియన్స్ కంప్లయింట్ ఇచ్చారని ఒక సినిమాని తీసేయడం చాలా అరుదు. విమర్శల సంగతి పక్కనపెడితే త్వరలో మార్కో 2కి రంగం సిద్ధమవుతోంది. మొదటి భాగంలోనే అంత రచ్చ చూపిస్తే ఇక సీక్వెల్ ఏ స్థాయిలో అరాచకం చేస్తారో ఊహించుకోవడం కష్టమే.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…