అనుపమ పరమేశ్వరన్ స్వతహాగా మలయాళీ అమ్మయే అయినా.. తెలుగులోనే ఆమెకు ఎక్కువ అవకాశాలు లభించాయి. ఇక్కడే ఆమె స్టార్ హీరోయిన్ అయింది. కెరీర్ ఆరంభంలో ప్రేమమ్, అఆ, శతమానం భవతి లాంటి సినిమాలతో ఆమె కెరీర్ దూసుకెళ్లింది. కానీ ఆ ఊపును ఆ తర్వాత కొనసాగించలేకపోయిందామె. మధ్యలో వరుసగా ఫ్లాపులొచ్చాయి. అయినా కొంచెం పుంజుకుని మళ్లీ సినిమాలు దక్కించుకుంది. హిట్లు కూడా ఇచ్చింది. అయినా సరే రేసులో ఆమె వెనుకబడిపోయింది.
హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు లాంటి హిట్ల తర్వాత కూడా ఆమె లైమ్ లైట్లో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక టాలీవుడ్లో అనుపమ కెరీర్ ముగిసినట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో ఎట్టకేలకు మళ్లీ ఓ ఛాన్స్ అందుకుంది ఈ మలయాళ కుట్టి.
నిఖిల్ హీరోగా సుకుమార్ స్క్రిప్టుతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించనున్న కొత్త సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఖరారైంది. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించనున్న ఈ సినిమాలో అనుపమ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నిజానికి ఈ సినిమా కథానాయికగా ముందు వినిపించిన పేరు అనుపమదే. కానీ తర్వాత ఆమె స్థానంలోకి గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రచారానికి తెర దించుతూ అనుపమను కథానాయికగా ప్రకటించారు. ఇది ఒక డైరీ నేపథ్యంలో సాగే సినిమా. కథానాయిక పాత్ర కీలకంగా ఉంటుందట. సుకుమార్ స్క్రిప్టు అంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనే అంతా అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అనుపమ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 19, 2020 7:47 am
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…