అనుపమ పరమేశ్వరన్ స్వతహాగా మలయాళీ అమ్మయే అయినా.. తెలుగులోనే ఆమెకు ఎక్కువ అవకాశాలు లభించాయి. ఇక్కడే ఆమె స్టార్ హీరోయిన్ అయింది. కెరీర్ ఆరంభంలో ప్రేమమ్, అఆ, శతమానం భవతి లాంటి సినిమాలతో ఆమె కెరీర్ దూసుకెళ్లింది. కానీ ఆ ఊపును ఆ తర్వాత కొనసాగించలేకపోయిందామె. మధ్యలో వరుసగా ఫ్లాపులొచ్చాయి. అయినా కొంచెం పుంజుకుని మళ్లీ సినిమాలు దక్కించుకుంది. హిట్లు కూడా ఇచ్చింది. అయినా సరే రేసులో ఆమె వెనుకబడిపోయింది.
హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు లాంటి హిట్ల తర్వాత కూడా ఆమె లైమ్ లైట్లో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇక టాలీవుడ్లో అనుపమ కెరీర్ ముగిసినట్లే అని అంతా భావిస్తున్న తరుణంలో ఎట్టకేలకు మళ్లీ ఓ ఛాన్స్ అందుకుంది ఈ మలయాళ కుట్టి.
నిఖిల్ హీరోగా సుకుమార్ స్క్రిప్టుతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించనున్న కొత్త సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా ఖరారైంది. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించనున్న ఈ సినిమాలో అనుపమ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
నిజానికి ఈ సినిమా కథానాయికగా ముందు వినిపించిన పేరు అనుపమదే. కానీ తర్వాత ఆమె స్థానంలోకి గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రచారానికి తెర దించుతూ అనుపమను కథానాయికగా ప్రకటించారు. ఇది ఒక డైరీ నేపథ్యంలో సాగే సినిమా. కథానాయిక పాత్ర కీలకంగా ఉంటుందట. సుకుమార్ స్క్రిప్టు అంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనే అంతా అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో అనుపమ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on October 19, 2020 7:47 am
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…