Movie News

అల్లు అరవింద్ 300 కోట్ల బడ్జెట్ ఇచ్చినా…

దర్శకుడిగా తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే తన సత్తా ఏంటో చూపించాడు చందూ మొండేటి. అతడి రెండో చిత్రం ‘ప్రేమమ్’ కూడా హిట్టే. మూడో సినిమా ‘సవ్యసాచి’ మాత్రం తేడా కొట్టింది. ఆ తర్వాత ‘కార్తికేయ-2’ బలంగా పుంజుకున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో చందూ మొండేటి పేరు మార్మోగింది. పెద్ద హీరోలు సైతం అతడితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.

చందూ తర్వాతి సినిమాను నిర్మించడానికి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత ముందుకు వచ్చారు. వీరి కలయికలో నాగచైతన్య హీరోగా ‘తండేల్’ రాబోతోంది. ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. ఐతే నిజానికి దీని బదులు చందూ.. గీతా ఆర్ట్స్ సంస్థలో వేరే పెద్ద సినిమా చేయాల్సిందట. అందుకోసం ఏకంగా రూ.300 బడ్జెట్ పెట్టడానికి కూడా అరవింద్ రెడీ అయ్యారట. కానీ చందూ మాత్రం ‘తండేల్’ చేయడానికే మొగ్గు చూపాడట.

దీని గురించి ఓ ఇంటర్వ్యూలో అతను ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.‘‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. ఐతే అరవింద్ గారు నన్ను ఆ కథ చేయొద్దన్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు.. కాబట్టి పెద్ద కాన్వాస్‌లో సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టారు.

అంతే కాక రూ.300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టడానికి కూడా సిద్ధమని చెప్పారు. కానీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’’ అంటూ ఆశ్చర్యకర విషయం చెప్పాడు చందూ. అరవింద్ లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్.. తనను నమ్మి 300 కోట్ల బడ్జెట్.. సూర్య లేదా రామ్ చరణ్ లాంటి హీరోను ఇస్తానన్నా కూడా అవి వద్దని ‘తండేల్’ చేయడం అంటే విశేషమే. అతను అంతగా ఇష్టపడి చేసిన సినిమాకు ఇప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరం.

This post was last modified on January 30, 2025 1:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

1 hour ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

1 hour ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

3 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

6 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

7 hours ago