దర్శకుడిగా తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే తన సత్తా ఏంటో చూపించాడు చందూ మొండేటి. అతడి రెండో చిత్రం ‘ప్రేమమ్’ కూడా హిట్టే. మూడో సినిమా ‘సవ్యసాచి’ మాత్రం తేడా కొట్టింది. ఆ తర్వాత ‘కార్తికేయ-2’ బలంగా పుంజుకున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. దీంతో చందూ మొండేటి పేరు మార్మోగింది. పెద్ద హీరోలు సైతం అతడితో సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
చందూ తర్వాతి సినిమాను నిర్మించడానికి అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత ముందుకు వచ్చారు. వీరి కలయికలో నాగచైతన్య హీరోగా ‘తండేల్’ రాబోతోంది. ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. ఐతే నిజానికి దీని బదులు చందూ.. గీతా ఆర్ట్స్ సంస్థలో వేరే పెద్ద సినిమా చేయాల్సిందట. అందుకోసం ఏకంగా రూ.300 బడ్జెట్ పెట్టడానికి కూడా అరవింద్ రెడీ అయ్యారట. కానీ చందూ మాత్రం ‘తండేల్’ చేయడానికే మొగ్గు చూపాడట.
దీని గురించి ఓ ఇంటర్వ్యూలో అతను ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.‘‘కార్తికేయ-2 తర్వాత గీతా ఆర్ట్స్లో సినిమా చేయాల్సి వచ్చినపుడు.. తండేల్ కథ నా ముందుకు వచ్చింది. ఐతే అరవింద్ గారు నన్ను ఆ కథ చేయొద్దన్నారు. కార్తికేయ-2ను నేను హ్యాండిల్ చేసిన తీరు గురించి చెబుతూ పెద్ద సినిమా చేద్దామన్నారు. మన దగ్గర సూర్య ఉన్నాడు, అలాగే రామ్ చరణ్ సైతం అందుబాటులో ఉన్నాడు.. కాబట్టి పెద్ద కాన్వాస్లో సినిమా చేద్దామని ప్రపోజల్ పెట్టారు.
అంతే కాక రూ.300 కోట్ల దాకా బడ్జెట్ పెట్టడానికి కూడా సిద్ధమని చెప్పారు. కానీ నేను మాత్రం ‘తండేల్’ కథే ఎందకు చేయకూడదు అన్నాను. ఆ కథే నాకు ఎక్కువ నచ్చి దాన్నే చేయడానికి రెడీ అయ్యాను’’ అంటూ ఆశ్చర్యకర విషయం చెప్పాడు చందూ. అరవింద్ లాంటి లెజెండరీ ప్రొడ్యూసర్.. తనను నమ్మి 300 కోట్ల బడ్జెట్.. సూర్య లేదా రామ్ చరణ్ లాంటి హీరోను ఇస్తానన్నా కూడా అవి వద్దని ‘తండేల్’ చేయడం అంటే విశేషమే. అతను అంతగా ఇష్టపడి చేసిన సినిమాకు ఇప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఆసక్తికరం.
This post was last modified on January 30, 2025 1:13 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…