ఇంటర్నెట్, సోషల్ మీడియా విప్లవం కారణంగా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. నెటిజన్లు ఇంటర్నెట్ను కాచి వడబోసేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా సరే.. ఒక సన్నివేశాన్నో.. లేదా ఒక మ్యూజిక్ బిట్నో.. లేదా ఒక పోస్టర్నో కాపీ కొట్టినా, స్ఫూర్తి పొందినా ఇట్టే పట్టేస్తున్నారు. ఇలాంటపుడు ఫిలిం మేకర్స్ జాగ్రత్తగా ఉండాల్సిందే. కాపీ కొట్టిన వాటికి ఎంత మేకప్ చేసినా సరే.. దాచడం కష్టమైపోతోంది.
తాజాగా ‘రాధేశ్యామ్’ టీం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ను తీర్చిదిద్దిన వాళ్లు కూడా దొరికిపోయారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఒక పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. పాత కాలం నాటి రైలు బండి నుంచి దట్టమైన పొగ బయటికొస్తూ ట్రాక్ పై ప్రాంతాన్నంతా కమ్మేస్తున్న దృశ్యం కనువిందుగా అనిపిస్తోంది. భలే ఉందే పోస్టర్ అంటూ నెటిజన్లు దాని మీద కామెంట్ చేశారు.
కానీ అందులో ‘రాధేశ్యామ్’ టీం క్రియేటివిటీ ఏమీ లేదని కొన్ని గంటల్లోనే తేలిపోయింది. దీని తాలూకు ఒరిజినల్ పిక్ను బయటికి తీసేశారు నెటిజన్లు. కాకపోతే ఆ పిక్కు ఫొటో షాప్ ఎఫక్ట్స్ జోడించి వేరే కలర్లోకి తీసుకొచ్చారు. పిక్ను క్లోజప్ చేశారు. కానీ ఎంత చేసినా ఒరిజినల్ పిక్ను పక్కన పెట్టి చూస్తే దానికిది కాపీ అనే విషయం అర్థమైపోతోంది.
ఇంతకుముందు ‘రాధేశ్యామ్’ టీం రిలీజ్ చేసిన ప్రభాస్, పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ పోస్టర్.. ‘కంచె’ సినిమా ఫస్ట్ లుక్ను గుర్తుకు తేవడం తెలిసిందే. ఎంత ఎఫెక్ట్స్ జోడించినా సరే.. ‘కంచెం’ లుక్కు కాపీ లాగే అనిపించిందది. ఇంతకుముందు ప్రభాస్ నటించిన ‘సాహో’ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద, దాని కంటే ముందు ‘బాహుబలి’ ప్రి లుక్ పోస్టర్ మీద కూడా ఇలాగే కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నెటిజన్లు ఇలా గాలి తీసేస్తున్నా సరే.. ప్రభాస్ సినిమాల మేకర్స్ జాగ్రత్త పడకుండా ఇలా కాపీ కొట్టడమో, స్ఫూర్తి పొందడమో చేసి మళ్లీ మళ్లీ దొరికిపోతుండటం ఏంటో?
This post was last modified on October 20, 2020 8:16 am
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…