ఇంటర్నెట్, సోషల్ మీడియా విప్లవం కారణంగా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. నెటిజన్లు ఇంటర్నెట్ను కాచి వడబోసేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల నుంచైనా సరే.. ఒక సన్నివేశాన్నో.. లేదా ఒక మ్యూజిక్ బిట్నో.. లేదా ఒక పోస్టర్నో కాపీ కొట్టినా, స్ఫూర్తి పొందినా ఇట్టే పట్టేస్తున్నారు. ఇలాంటపుడు ఫిలిం మేకర్స్ జాగ్రత్తగా ఉండాల్సిందే. కాపీ కొట్టిన వాటికి ఎంత మేకప్ చేసినా సరే.. దాచడం కష్టమైపోతోంది.
తాజాగా ‘రాధేశ్యామ్’ టీం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ను తీర్చిదిద్దిన వాళ్లు కూడా దొరికిపోయారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో ఒక పోస్టర్ వదిలిన సంగతి తెలిసిందే. పాత కాలం నాటి రైలు బండి నుంచి దట్టమైన పొగ బయటికొస్తూ ట్రాక్ పై ప్రాంతాన్నంతా కమ్మేస్తున్న దృశ్యం కనువిందుగా అనిపిస్తోంది. భలే ఉందే పోస్టర్ అంటూ నెటిజన్లు దాని మీద కామెంట్ చేశారు.
కానీ అందులో ‘రాధేశ్యామ్’ టీం క్రియేటివిటీ ఏమీ లేదని కొన్ని గంటల్లోనే తేలిపోయింది. దీని తాలూకు ఒరిజినల్ పిక్ను బయటికి తీసేశారు నెటిజన్లు. కాకపోతే ఆ పిక్కు ఫొటో షాప్ ఎఫక్ట్స్ జోడించి వేరే కలర్లోకి తీసుకొచ్చారు. పిక్ను క్లోజప్ చేశారు. కానీ ఎంత చేసినా ఒరిజినల్ పిక్ను పక్కన పెట్టి చూస్తే దానికిది కాపీ అనే విషయం అర్థమైపోతోంది.
ఇంతకుముందు ‘రాధేశ్యామ్’ టీం రిలీజ్ చేసిన ప్రభాస్, పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ పోస్టర్.. ‘కంచె’ సినిమా ఫస్ట్ లుక్ను గుర్తుకు తేవడం తెలిసిందే. ఎంత ఎఫెక్ట్స్ జోడించినా సరే.. ‘కంచెం’ లుక్కు కాపీ లాగే అనిపించిందది. ఇంతకుముందు ప్రభాస్ నటించిన ‘సాహో’ ఫస్ట్ లుక్ పోస్టర్ మీద, దాని కంటే ముందు ‘బాహుబలి’ ప్రి లుక్ పోస్టర్ మీద కూడా ఇలాగే కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వరుసగా నెటిజన్లు ఇలా గాలి తీసేస్తున్నా సరే.. ప్రభాస్ సినిమాల మేకర్స్ జాగ్రత్త పడకుండా ఇలా కాపీ కొట్టడమో, స్ఫూర్తి పొందడమో చేసి మళ్లీ మళ్లీ దొరికిపోతుండటం ఏంటో?
This post was last modified on October 20, 2020 8:16 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…