పరిశ్రమ పచ్చగా ఉండాలంటే ఎక్కువ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు పడాలి. అసలే ఇది ఓటిటి యుగం. మార్నింగ్ షోకి టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా సాయంత్రం ఆటకు జనం ఉండటం లేదు. పెద్ద చిన్న తేడా లేకుండా అందరు హీరోలకు ఇది అనుభవమే. అలాంటిది ఏకంగా 223 ఫ్లాపులు ఒకే ఇండస్ట్రీ నుంచి వచ్చాయంటే అంత కంటే షాక్ వేరే ఉంటుందా.
ప్రస్తుతం కోలీవుడ్ ఈ దశను చూస్తోంది. 2024 సంవత్సర కాలానికి 240కి పైగా సినిమాలు నిర్మిస్తే వాటిలో కేవలం 20 లోపే విజయం సాధించడం ఆందోళన కలిగిస్తోంది. వీటి మీద మొత్తం పెట్టుబడి మూడు వేల కోట్లను దాటిపోయి ఉంటుందని ట్రేడ్ ప్రాధమిక అంచనా.
ఇంత దారుణమైన పరిస్థితికి దోహదం చేసిన ప్యాన్ ఇండియా సినిమాల గురించి చెప్పుకోవాలి. మొదటిది కంగువ. నిర్మాత ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు చేస్తుందని ఇచ్చిన స్టేట్ మెంట్ కి బద్ద వ్యతిరేకంగా కనీసం రెండు వందల కోట్లు కూడా తేలేకపోయింది. ఇక ఇండియన్ 2 గురించి తలుచుకోవడానికి కూడా అక్కడి బయ్యర్లు భయపడుతున్నారు.
వెట్టయన్ ఏదో హడావిడి చేశారు కానీ ఇది కూడా కష్టం మీద గట్టెక్కిన లాస్ వెంచరే. రజనీకాంత్ అతిథి పాత్రను నమ్ముకుని బిల్డప్ ఇచ్చిన లాల్ సలామ్ కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా తేలేదు. విజయ్ గోట్ నెగటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కొంత ఊరట కలిగించింది.
ప్రస్తుతం తమిళ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాకపోతే 2025 ఓపెనింగ్ బాగుండటం కొంత ఊరట కలిగిస్తోంది. మదగజరాజా పన్నెండేళ్ల తర్వాత రిలీజై 60 కోట్లను మించి వసూలు చేయడం మాములు కిక్ ఇవ్వలేదు. తాజాగా కుటుంబస్తాన్ పాజిటివ్ టాక్ క్రమంగా కలెక్షన్లను పెంచుతోంది.
గేమ్ ఛేంజర్ దెబ్బ ముందే ఊహించడంతో దానికేం వర్రీ అవ్వలేదు. తమిళంతో పోలిస్తే టాలీవుడ్ చాలా పైఎత్తులో ఉంది. హనుమాన్, నా సామిరంగా, టిల్లు స్క్వేర్, దేవర, కల్కి 2898 ఏడి, పుష్ప 2 ది రూల్, సరిపోదా శనివారం ఇలా పెద్ద హిట్లు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మనోళ్ల స్పీడ్ ఈ ఏడాది కూడా తగ్గేలా లేదు.
This post was last modified on January 30, 2025 9:59 am
ఈ నెల 28 లేదా మార్చి 1న ఏపీ వార్షిక(2025-26) బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. దీనిపై…
మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సందర్భంగా తుది ఫలితం వెలువడక ముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్న గుడివాడ…
గత శుక్రవారం మంచి అంచనాల మధ్య విడుదలైన హిందీ సినిమా.. చావా. లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ…
సామాజిక మాధ్యమాల్లో అత్యంత బలమైన.. క్షణాల్లోనే ఆకర్షించగల సత్తా ఉన్న మాధ్యమం యూట్యూబ్. దీనికి చదువుతో పనిలేదు. కేవలం ఒక్క…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతి నగరం సోమవారం మహా కుంభ ఆప్ టెంపుల్స్ పేరిట ప్రారంభమైన…
ప్రపంచ వాణిజ్య విఫణిలో భారత దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సత్తా చాటింది. గతంలో ఏ ఒక్క బారత కంపెనీకి దక్కని…