పరిశ్రమ పచ్చగా ఉండాలంటే ఎక్కువ సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు పడాలి. అసలే ఇది ఓటిటి యుగం. మార్నింగ్ షోకి టాక్ ఏ మాత్రం తేడా కొట్టినా సాయంత్రం ఆటకు జనం ఉండటం లేదు. పెద్ద చిన్న తేడా లేకుండా అందరు హీరోలకు ఇది అనుభవమే. అలాంటిది ఏకంగా 223 ఫ్లాపులు ఒకే ఇండస్ట్రీ నుంచి వచ్చాయంటే అంత కంటే షాక్ వేరే ఉంటుందా.
ప్రస్తుతం కోలీవుడ్ ఈ దశను చూస్తోంది. 2024 సంవత్సర కాలానికి 240కి పైగా సినిమాలు నిర్మిస్తే వాటిలో కేవలం 20 లోపే విజయం సాధించడం ఆందోళన కలిగిస్తోంది. వీటి మీద మొత్తం పెట్టుబడి మూడు వేల కోట్లను దాటిపోయి ఉంటుందని ట్రేడ్ ప్రాధమిక అంచనా.
ఇంత దారుణమైన పరిస్థితికి దోహదం చేసిన ప్యాన్ ఇండియా సినిమాల గురించి చెప్పుకోవాలి. మొదటిది కంగువ. నిర్మాత ఏకంగా రెండు వేల కోట్ల వసూళ్లు చేస్తుందని ఇచ్చిన స్టేట్ మెంట్ కి బద్ద వ్యతిరేకంగా కనీసం రెండు వందల కోట్లు కూడా తేలేకపోయింది. ఇక ఇండియన్ 2 గురించి తలుచుకోవడానికి కూడా అక్కడి బయ్యర్లు భయపడుతున్నారు.
వెట్టయన్ ఏదో హడావిడి చేశారు కానీ ఇది కూడా కష్టం మీద గట్టెక్కిన లాస్ వెంచరే. రజనీకాంత్ అతిథి పాత్రను నమ్ముకుని బిల్డప్ ఇచ్చిన లాల్ సలామ్ కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా తేలేదు. విజయ్ గోట్ నెగటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అందుకోవడం కొంత ఊరట కలిగించింది.
ప్రస్తుతం తమిళ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాకపోతే 2025 ఓపెనింగ్ బాగుండటం కొంత ఊరట కలిగిస్తోంది. మదగజరాజా పన్నెండేళ్ల తర్వాత రిలీజై 60 కోట్లను మించి వసూలు చేయడం మాములు కిక్ ఇవ్వలేదు. తాజాగా కుటుంబస్తాన్ పాజిటివ్ టాక్ క్రమంగా కలెక్షన్లను పెంచుతోంది.
గేమ్ ఛేంజర్ దెబ్బ ముందే ఊహించడంతో దానికేం వర్రీ అవ్వలేదు. తమిళంతో పోలిస్తే టాలీవుడ్ చాలా పైఎత్తులో ఉంది. హనుమాన్, నా సామిరంగా, టిల్లు స్క్వేర్, దేవర, కల్కి 2898 ఏడి, పుష్ప 2 ది రూల్, సరిపోదా శనివారం ఇలా పెద్ద హిట్లు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మనోళ్ల స్పీడ్ ఈ ఏడాది కూడా తగ్గేలా లేదు.
This post was last modified on January 30, 2025 9:59 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…