Movie News

57 రోజులైనా.. అచేతనంగానే బన్నీ బుల్లి ఫ్యాన్ శ్రీతేజ్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్ 4ను ఎన్నటికీ మరిచిపోలేడు. కారణమేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. బన్నీ హిట్ మూవీ పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగగా… బన్నీని చూసేందుకు వచ్చిన రేవతి అక్కడికక్కడే చనిపోగా…ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శ్రీతేజ్ ఊరిపి ఆగిపోగా… క్షణాల్లో అందిన సీపీఆర్ తో బతికిపోయాడు. ఆ తర్వాత అతడిని సికింద్రాబాద్ లోని కిమ్స్ కు తరలించారు.

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కొన్నిరోజుల పాటు అతడికి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఆ తర్వాత అతడిని స్పెషల్ వార్డుకు తరలించారు. గురువారం నాటికి అతడు ఆసుపత్రిలో చేరి 57 రోజులు కావస్తోంది. అయినా కూడా అతడి ఆరోగ్యం మెరుగుపడిన దాఖలానే కనిపించలేదు. ఇప్పటికీ అతడు ఎవరితో మాట్లాడలేకపోతున్నాడు. కనీసం తనను పరామర్శించేందుకు వచ్చే వారితో పాటు తన కుటుంబ సభ్యులను కూడా అతడు కళ్లు తెరిచి కూడా చూడలేకపోతున్నాడు. ఇప్పటికీ అతడికి లిక్విడ్ ఫుడ్ నే అందిస్తున్నారు. అది కూడా ముక్కు ద్వారంలో ఏర్పాటు చేసిన ఓ పైపు ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు.

శ్రీతేజ్ కు ఇంకెన్ని రోజులు చికిత్స అందిస్తే అతడి ఆరోగ్యం బాగుపడుతుందన్న విషయాన్ని వైద్యులే చెప్పలేకపోతున్నారు. బన్నీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న శ్రీతేజ్ కోరిక మేరకే అతడి ఫ్యామిలీ నాడు సంధ్య థియేటర్ కు వచ్చిందట. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో శ్రీతేజ్ తన తల్లిని కోల్పోయాడు. తాను ఆసుపత్రి బెడ్ కు పరిమితమయ్యాడు. ప్రస్తుతం అతడు శ్వాసను మాత్రమే సొంతంగా తీసుకోగలుగుతున్నాడు. మిగిలిన ఏ పనికీ అతడి శరీరం సహకరించడం లేదు.ఈ ప్రమాదం నేపథ్యంలో ఏకంగా అరెస్ట్ అయిన బన్నీ… సినిమా హిట్ ను కూడా ఎంజాయ్ చేయలేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

Satya

Recent Posts

భ్రమలో ఉన్న ఫ్లాప్ దర్శకుడు

తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…

47 minutes ago

ఐపీఎల్ 2026 అట్టర్ ఫ్లాప్

ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…

1 hour ago

ఒక్క థియేట‌ర్ మీద ఇంత గొడ‌వా?

నిజామాబాద్‌లో న‌ట‌రాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడ‌వ టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…

2 hours ago

జెన్‌-జీ రాజకీయం మొదలుపెట్టిన పవన్

ఏపీ అధికార పార్టీ జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో యువ‌త‌రాన్ని ఆకర్షించేందుకు..…

3 hours ago

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం…

5 hours ago

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…

7 hours ago