మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ కెరీర్ పరంగా కొన్నేళ్లుగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్.. రెండేళ్ల వ్యవధిలో అతడి నుంచి వచ్చిన ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఈ స్థితిలో తన ఆశలన్నీ ‘మట్కా’ మీదే నిలిచాయి. కానీ గత నవంబర్లో విడుదలైన ఈ చిత్రం కూడా వరుణ్ను తీవ్ర నిరాశకు గురి చేసింది.
గత సినిమాలు ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయినా తెచ్చుకున్నాయి. కానీ ఈ చిత్రానికి అదీ లేదు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెడితే.. థియేటర్ల నుంచి ఐదు శాతం కూడా వెనక్కి రాలేదు. వచ్చిన ఆదాయం థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులకే సరిపోవడంతో ‘మట్కా’ జీరో షేర్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాత గట్టి దెబ్బ తిన్నాడు. ఈ ప్రభావం వరుణ్ తర్వాతి సినిమా మీద పడుతుందనే అనుకున్నారు చాలామంది.
కానీ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ హీరోగా చర్చల దశలో ఉన్న సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించింది. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం లొకేషన్ల వేటలో భాగంగా వియత్నాంలో పర్యటిస్తుండడం విశేషం. హీరో, దర్శకుడు, నిర్మాతలు వియత్నాలు వియత్నాలో రెక్కీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను చాలా వరకు విదేశాల్లో చిత్రీకరించబోతున్నారట. అందులో భాగంగానే భారీ లొకేషన్ల వేట జరుగుతోంది. వరుస ఫ్లాపులతో మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో వరుణ్తో ఈసారి పరిమిత బడ్జెట్లో సినిమా చేస్తారేమో అనుకున్నారు చాలామంది.
కానీ యువి వాళ్లు మాత్రం హీరో మీద నమ్మకం పెట్టి.. తమ బేనర్ స్టాండర్డ్స్ ప్రకారమే సినిమా తీయాలని నిర్ణయించినట్లున్నారు. ఈ చిత్రం వరుణ్తో పాటు దర్శకుడు మేర్లపాక గాంధీకి కూడా కీలకమే. అతడి చివరి రెండు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి.
This post was last modified on January 29, 2025 9:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…