మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ కెరీర్ పరంగా కొన్నేళ్లుగా బాగా ఇబ్బంది పడుతున్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్.. రెండేళ్ల వ్యవధిలో అతడి నుంచి వచ్చిన ఈ మూడు చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఈ స్థితిలో తన ఆశలన్నీ ‘మట్కా’ మీదే నిలిచాయి. కానీ గత నవంబర్లో విడుదలైన ఈ చిత్రం కూడా వరుణ్ను తీవ్ర నిరాశకు గురి చేసింది.
గత సినిమాలు ఓ మోస్తరు ఓపెనింగ్స్ అయినా తెచ్చుకున్నాయి. కానీ ఈ చిత్రానికి అదీ లేదు. దాదాపు 40 కోట్ల బడ్జెట్ పెడితే.. థియేటర్ల నుంచి ఐదు శాతం కూడా వెనక్కి రాలేదు. వచ్చిన ఆదాయం థియేటర్ల మెయింటైనెన్స్ ఖర్చులకే సరిపోవడంతో ‘మట్కా’ జీరో షేర్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. నిర్మాత గట్టి దెబ్బ తిన్నాడు. ఈ ప్రభావం వరుణ్ తర్వాతి సినిమా మీద పడుతుందనే అనుకున్నారు చాలామంది.
కానీ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ హీరోగా చర్చల దశలో ఉన్న సినిమాను యువి క్రియేషన్స్ సంస్థ ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించింది. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్ర బృందం లొకేషన్ల వేటలో భాగంగా వియత్నాంలో పర్యటిస్తుండడం విశేషం. హీరో, దర్శకుడు, నిర్మాతలు వియత్నాలు వియత్నాలో రెక్కీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను చాలా వరకు విదేశాల్లో చిత్రీకరించబోతున్నారట. అందులో భాగంగానే భారీ లొకేషన్ల వేట జరుగుతోంది. వరుస ఫ్లాపులతో మార్కెట్ దెబ్బ తిన్న నేపథ్యంలో వరుణ్తో ఈసారి పరిమిత బడ్జెట్లో సినిమా చేస్తారేమో అనుకున్నారు చాలామంది.
కానీ యువి వాళ్లు మాత్రం హీరో మీద నమ్మకం పెట్టి.. తమ బేనర్ స్టాండర్డ్స్ ప్రకారమే సినిమా తీయాలని నిర్ణయించినట్లున్నారు. ఈ చిత్రం వరుణ్తో పాటు దర్శకుడు మేర్లపాక గాంధీకి కూడా కీలకమే. అతడి చివరి రెండు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి.
This post was last modified on January 29, 2025 9:12 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…