స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. కొన్ని నెలల కిందట ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతంలో తన దగ్గర అసిస్టెంట్గా పని చేసిన ఓ అమ్మాయి కేసు పెట్టడం.. దీంతో అతను జైలు పాలవడం.. ఆపై బెయిల్ మీద బయటికి రావడం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సైతం ఒక కేసు పెట్టింది.
దీన్ని సవాలు చేస్తూ జానీ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను కొట్టేసినట్లు ఫిలిం ఛాంబర్ ప్రతినిధిగా ఝాన్సీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చనీయాంశం అయింది. ఐతే ఝాన్సీ పోస్ట్ అబద్ధమంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వెంటనే జానీ మాస్టర్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. దీంతో ఎవరి వాదన కరెక్ట్ అనే చర్చ మొదలైంది.
ముందుగా ఝాన్సీ పోస్టు విషయానికి వస్తే.. ‘‘ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కేసుపై సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడూ మద్దతు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నిజంగా ఇది చాలా ముఖ్యమైన తీర్పు.
ఈ విషయంలో ఫెడరేషన్ కఠినంగా ఉండి, ధర్మం వైపు నిలబడినందుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు’’ అని ఝాన్సీ పేర్కొంది. కాసేపట్లోనే ఈ జానీ కౌంటర్గా పోస్టు పెట్టాడు. ‘‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేని కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’’ అని తన పోస్ట్లో పేర్కొన్నారు.
This post was last modified on January 29, 2025 9:06 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…