స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. కొన్ని నెలల కిందట ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతంలో తన దగ్గర అసిస్టెంట్గా పని చేసిన ఓ అమ్మాయి కేసు పెట్టడం.. దీంతో అతను జైలు పాలవడం.. ఆపై బెయిల్ మీద బయటికి రావడం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సైతం ఒక కేసు పెట్టింది.
దీన్ని సవాలు చేస్తూ జానీ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను కొట్టేసినట్లు ఫిలిం ఛాంబర్ ప్రతినిధిగా ఝాన్సీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చనీయాంశం అయింది. ఐతే ఝాన్సీ పోస్ట్ అబద్ధమంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వెంటనే జానీ మాస్టర్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. దీంతో ఎవరి వాదన కరెక్ట్ అనే చర్చ మొదలైంది.
ముందుగా ఝాన్సీ పోస్టు విషయానికి వస్తే.. ‘‘ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కేసుపై సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడూ మద్దతు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నిజంగా ఇది చాలా ముఖ్యమైన తీర్పు.
ఈ విషయంలో ఫెడరేషన్ కఠినంగా ఉండి, ధర్మం వైపు నిలబడినందుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు’’ అని ఝాన్సీ పేర్కొంది. కాసేపట్లోనే ఈ జానీ కౌంటర్గా పోస్టు పెట్టాడు. ‘‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేని కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’’ అని తన పోస్ట్లో పేర్కొన్నారు.
This post was last modified on January 29, 2025 9:06 pm
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు…