స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. కొన్ని నెలల కిందట ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతంలో తన దగ్గర అసిస్టెంట్గా పని చేసిన ఓ అమ్మాయి కేసు పెట్టడం.. దీంతో అతను జైలు పాలవడం.. ఆపై బెయిల్ మీద బయటికి రావడం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సైతం ఒక కేసు పెట్టింది.
దీన్ని సవాలు చేస్తూ జానీ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ను కొట్టేసినట్లు ఫిలిం ఛాంబర్ ప్రతినిధిగా ఝాన్సీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చనీయాంశం అయింది. ఐతే ఝాన్సీ పోస్ట్ అబద్ధమంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వెంటనే జానీ మాస్టర్ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. దీంతో ఎవరి వాదన కరెక్ట్ అనే చర్చ మొదలైంది.
ముందుగా ఝాన్సీ పోస్టు విషయానికి వస్తే.. ‘‘ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కేసుపై సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పని చేసే ప్రదేశాలలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని, POSH మార్గదర్శకాలను అమలు చేసే సంస్థలకు ఎప్పుడూ మద్దతు ఉంటుందనేది మరోసారి రుజువైంది. నిజంగా ఇది చాలా ముఖ్యమైన తీర్పు.
ఈ విషయంలో ఫెడరేషన్ కఠినంగా ఉండి, ధర్మం వైపు నిలబడినందుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు’’ అని ఝాన్సీ పేర్కొంది. కాసేపట్లోనే ఈ జానీ కౌంటర్గా పోస్టు పెట్టాడు. ‘‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేని కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది’’ అని తన పోస్ట్లో పేర్కొన్నారు.
This post was last modified on January 29, 2025 9:06 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…