బాలీవుడ్లో పెద్దగా హడావుడి చేయకుండా తన పనేదో తాను చేసుకుపోయే స్టార్ హీరోల్లో షాహిద్ కపూర్ ఒకడు. తన గురించి పెద్దగా కాంట్రవర్శీలు బయటికి రావు. అలాంటి వ్యక్తి ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అతను సల్మాన్ ఖాన్తో పాటు దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ల మీద పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా సల్మాన్ మీద చేసినట్లుగా భావిస్తున్న కామెంట్స్ దుమారం రేపాయి.
కొందరు పెద్ద స్టార్లు అక్కడికి వచ్చినా అందరి అటెన్షన్ తన మీదే ఉండాలి అనేట్లుగా నడుస్తారని.. ప్రవర్తిస్తారని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. షాహిద్ కామెంట్స్ సల్మాన్ను ఉద్దేశించిన చేసినవే అంటూ ఆయన ఫ్యాన్స్ షాహిద్ మీద యుద్ధం ప్రకటించారు. అతణ్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అతను వివరణ ఇచ్చాడు.
తన వ్యాఖ్యలు సల్మాన్ను ఉద్దేశించినవి కావని షాహిద్ స్పష్టం చేశాడు. ‘‘నేను ఎవరి మీదైనా విమర్శలు చేయాలనుకుంటే.. ఎంతో సీనియర్ అయిన, మంచి గుర్తింపు ఉన్న అలాంటి వ్యక్తి మీద అస్సలు చేయను. నాకు ఆయన మీద అపారమైన గౌరవం ఉంది. ఆ విషయాన్ని స్ఫష్టం చేయాలనుకుంటున్నా’’ అని షాహిద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. షాహిద్ చేసిన మరో కామెంట్ మాత్రం దీపికా-రణ్వీర్ల గురించే అని భావిస్తున్నారు.
తన సినిమా ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడు తన స్థాయి చాలా తక్కువ అని పోటీలో ఉన్న ఒక సినిమాలో భాగమైన వ్యక్తులు పీఆర్ ద్వారా నెగెటివ్ ప్రచారం చేయడానికి ప్రయత్నించినట్లు అతను ఆరోపించాడు. ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడే దీపికా-రణ్వీర్ల ‘పద్మావత్’ విడుదల కావడంతో అతను కామెంట్ చేసింది వీళ్లిద్దరి గురించే అనే చర్చ మొదలైంది. ‘పద్మావత్’ ఫుల్ పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ.. మోడరేట్ రివ్యూలు తెచ్చుకున్న ‘కబీర్ సింగ్’ దానిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది.
This post was last modified on January 29, 2025 9:01 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…